భక్తుల విశేషాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజుల్లో అంటరానివాడుగా మునివాహనుడిని అంతా ఈసడించేవారు.రంగనాథదేవాలయంకి దూరంగా పూరిగుడిసెలోఉంటూ భగవస్మరణచేస్తూ వీధులన్నీ ఊడ్చేవాడు. అలా రంగనాథాలయదర్శనం జరిగేది.ఒక రోజు మునివాహనుడు ఊడుస్తుండగా ఆదుమ్ముతనపై పడుతోందని ఓ అహంకారి అతన్ని తిట్టాడు.పాపం బాధతో ఇంటికెళ్లిన అతను రోజంతా ఏడుస్తూనే  ఉన్నాడు.ఆరాత్రి కలలో స్వామి ఆ అహంకారి బాటసారికి కన్పడి" మునివాహనుడు నాప్రియభక్తుడు.అతన్ని గుడిలోకి తీసుకురాకపోతే సర్వనాశనం ఔతావు. అంతే,అతను గజగజ వణుకుతూ ఆభక్తుని తన భుజాలపై మోస్తూ విగ్రహం దగ్గరకు తీసుకెళ్లటం ఆలస్యం,మునివాహనుడు ఆదైవంలో లీనమైనాడుభక్త రైదాస్ చర్మకారునింట పుట్టాడు.చదువుసంధ్య లేకున్న సదా రామనామజపంచేస్తూ ఉండే అతన్నిచిత్తౌడ్ రాణి తన రాణీవాసానికి ఆహ్వానించింది. ఇతరజనాలకి ఈర్ష్య అసూయ పుట్టి  రాణాతో అన్నారు" ప్రభూ !ఈ కొయ్య తొట్టెలోకి గంగాజలంని వచ్చేలా రైదాస్ చేయగల్గితే మేము అతన్ని అందలం ఎక్కిస్తాం" ఖాళీ తొట్టెలో దైవ స్మరణ చేస్తున్న రైదాస్ చెయ్యి పెట్టగానే జలజల ఉప్పొంగి గంగ ఆరాజమహల్ ని తడిపింది. భక్తికి కులం జాతిప్రాంత భేదాలు లేవని ఏనాడో విదితం.మరి నేడుమనం కులం మతం పేరుతో జుట్టుపట్టుకుని రచ్చకెక్కుతున్నాం.🌷
కామెంట్‌లు