కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని: - కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) విశాఖపట్నం.
పన్నెండు సంవత్సరాల పసిప్రాయంలోనే
తెలుగు, సంస్కృతభాషలలో ప్రావీణ్యత నొంది
వేద,తర్క తత్వ,గణిత,జ్యోతిష్య ,ఆయుర్వేద శాస్త్రాలలో
అసమాన ప్రతిభ 
వాక్చాతుర్యం, సంస్కృతభాషా ప్రావీణ్యంతో
నవద్వీపమందు విద్వత్పరీక్షలందు పాల్గొని
'కావ్యకంఠ' బిరుదు పొందిన
సరస్వతీ మాత మానసపుత్రులే
వాశిష్ఠ గణపతి ముని.!

కుటుంబ జీవితాన్ని గడుపుతు
బాధ్యతలను నిర్వర్తిస్తూ తపస్సు 
చేసుకోవడం ద్వారా మోక్షం పొందవచ్చన్న 
సనాతన ఋషి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి
అరుణాచలంలో బ్రాహ్మణస్వామిని రమణ మహర్షిగా  పేర్కొని
అస్పృశ్యత నివారణకొరకు
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని
స్త్రీ సాధికారికత కొరకు పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు కావ్యకంఠ గణపతి.!

రమణమహర్షి 'నాయన'  అని పిలిచే వీరు
శ్రీరమణ పంచక ,ఉమాసహస్ర0, మనీషా 
సంగ్రహః,వివాహ ధర్మ సూత్రం, రేణుకాస్టకం,ఋగ్వేద భాష్యం వంటి
ఎన్నెన్నో రచనలు చేసిన మంత్రద్రష్ట.!
.
ఆనాడే మానవత్వమే మాధవత్వమని
హరిజనోద్ధరణకు పాటుపడిన మహనీయులు
కౌ0డిన్యస గోత్రికులు
అయ్యలసోమయాజుల వాశిష్ఠ గణపతి ముని
మీరు దైవంశ సంభూతులే
అందుకోండి మీకివే నా అక్షరాంజలులు !!
............... ..............


కామెంట్‌లు