జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగుట విద్యార్ధులకు అంతర్జాతీయ గుర్తింపు*
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న అంతర్జాతీయ  బాల రచయితల సమ్మేళనంలో పాల్గొనటానికి ఆహ్వానం 
----------------------------------------
ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా నవంబర్ 30, 2025 ఆదివారం అంతర్జాలంలో ప్రతిష్టాత్మకంగా 13 గంటల పాటు బాలసాహిత్య భేరి పేరుతో  "అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం" నిర్వహిస్తుంది. 
ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొనటానికి తెలంగాణ  రాష్ట్రం,  సిద్దిపేట జిల్లా జిల్లా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులు   రంగరమైన విష్ణువర్ధన్, చిక్కుడు రేఖ, అనిమెల్ల శ్రీనివాస్, అనిమెల్ల జస్వంత్  , చిక్కుడు ఓంకార్ ఎంపికయ్యారు.  కథ, వచన కవిత్వం, గేయం ,పద్యం విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థిని విద్యార్థులు 101 మంది కార్యక్రమంలో పాల్గొంటారు. మా విద్యార్థులు పద్య విభాగంలో  ఎంపికై మూడు నిమిషాల పాటు  తాము వ్రాసిన   పద్యాలను వినిపిస్తారని పాఠశాల  ప్రధానోపాధ్యాయులు  శ్రీ A. ఉపేందర్  గారు తమ హర్షాన్ని  ఒక ప్రకటనలో తెలియజేశారు.
విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రఖ్యాత బాల సాహితీవేత్తలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్న ఈ
అంతర్జాతీయ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి, సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ  శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

కామెంట్‌లు