59 వ రోజు
సన్మానించడం నేను సహించలేను. నాతో యుద్ధానికి సిద్ధం కండి " అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి " మేము ప్రాగ్జ్యోతిష పురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు " అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి " నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా ? " అని దూషించావు .ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు . తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు తో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.
రాజసూయయాగం అనంతర విశేషాలు[
ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను, గురువులను, బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ , దృతరాష్ట్రులను సాగనంపాడు. అలాగే అర్జునుడు దృపదుని సాగనంపారు. నకులుడు శల్యుని, సుబలుని సాగనంపాడు. సహదేవుడు ద్రోణ, కృప అశ్వత్థామ లను సాగనంపాడు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. పాడవులందరూ శ్రీకృష్ణుని సాగనంపారు. వ్యాస మహర్షి కూడా బయలు దేరుతూ శిష్యులతోగూడి ధర్మరాజు దగ్గరికి రాగా ధర్మరాజు "పురుషోత్తమా! రాజసూయయాగమును చేయమన్న మా తండ్రిగారి సందేశమును నారద మహర్షి తెలుపుతూ రాజసూయయాగము చేయడం వలన ఈ భూమండలంపై సర్వక్షత్రియ వినాశాకమైన ఉత్పాదం, యుద్ధం సంభవించే కారణమైన సంఘటన జరిగేఅవకాశం ఉన్నదన్నారు. శిశుపాలుడి వధతో ఆ ఉత్పాతాలు సమసి పోయినట్లేనా" అని అడిగాడు. అంత వ్యాస మాహర్షి " నాయనా యుధిష్టిరా! మహోత్పాతాల ప్రభావం పదమూడేల్లు ఉంటుంది. సర్వక్షత్రియ నాశము జేరుగుతుంది. ఆ సమయం రాగానే నీ కారణంగా దుర్యోధనుడి అపరాధం వలన భీమార్జునుల పరాక్రమం ద్వారా భూమి మీది రాజులందరూ కలిసి పరస్పర యుద్దంలో నాశనం అవుతారు.ఇందుకు నిదర్శనంగా తెల్లవారు జామున స్వప్నంలో నీవు వృషభారూడ్డుడైన పరమశివుడు దక్షిణ దిక్కును చూస్తూ కనిపిస్తాడు. దాని గురుంచి చింతించకు. కాలం దాటరానిది. నీకు శుభమవుగాక. అప్రమత్తంగా ఉంటూ భూమిని పరిపాలించు" అని చెప్పికైలాస పర్వతానికి వెళతాడు. ధర్మరాజు తమ్ములందరితో " వ్యాసమహర్షి నాతో చెప్పినది విన్నారు గదా. సర్వక్షత్రియ నాశనానికి విధి నన్ను కారణముగా చేయదలచుకుంటే నేను జీవించి ఉండటం వలన ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను మరణించాలను కుంటున్నాను" అని తన నిశ్చయం తెలియ జేయగా అంత అర్జునుడు "ఘోరమైన ఇటువంటి మోహమును పొందక, ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు మేము నిన్ను అనుసరిస్తాము" అన్నాడు. అంత ధర్మరాజు "సోదరులను గాని, ఇతరరాజులనుగాని పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ భేదభావం రాకుండా, విరోధం రాకుండా అడిగినవి ఇస్తూ, చెప్పినవి చేస్తూవుంటాను" అని ప్రతిజ్ఞ చేయగ తమ్ముల్లందరు అందుకు సమ్మతించారు.మయసభ విశేషాలు చూడటానికి శకుని దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. ఒక రోజు సుయోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడా భంగపడ్డారు. తెరచిన ద్వారం మూసి ఉన్నట్లు గానూ, మూసిన ద్వారం తెరచినది గాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరులేనిచోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని బ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు. అతని అవస్థ చూసి ధర్మరాజు సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు. హస్థినకు బయలుదేరాడు. మయసభా విభవం పాండవుల వైభవం అతనిలో అసూయా అగ్నిజ్వాలలా రగిలించింది. దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృశించి పోసాగాడు. శకుని ఇది గమనించి " సుయోధనా నీకు ఏమైంది? " అని అడిగాడు. దుర్యోధనుడు " మామా మయసభ చూసావు కదా. అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్ట వంతుడు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజుకు అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించినా రాజులు పొగిడారు కాని ఏమని అడగలేదు. పాండవుల ఐస్వైర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధనుడు దాయాదుల వైభవాన్ని సహింపకలడా ? " అని దు॰ఖించాడు. శకుని " సుయోధనా ! దృతరాష్టృని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్ను పోస్ట్ చేయండి