బీచ్ రోడ్:- - యామిజాల జగదీశ్
 మద్రాస్ బీచ్ రోడ్డుకో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి, సౌత్ బీచ్ రోడ్ (ఇప్పుడు కామరాజ్ శాలై ). నార్త్ బీచ్ రోడ్ (ఇప్పుడు రాజాజీ శాలై ).
సౌత్ బీచ్ రోడ్డుని 1845 ప్రాంతంలో అభివృద్ధి చేశారు. తరువాత 1884లో గవర్నర్ గ్రాంట్ - డఫ్ పూనికతో మెరీనా అనే విహార ప్రదేశంగా మారింది. వాణిజ్య జిల్లా, ఓడరేవు చుట్టూ నార్త్ బీచ్ రోడ్డు అభివృద్ధి చెందింది‌. ముఖ్యమైన పరిపాలనా, ఆర్థిక భవనాలను కలిగి ఉన్న రహదారి ఇది.
చేపాక్ ప్యాలెస్ చుట్టూ ఉన్న గోడ కూల్చివేసిన తర్వాత ఫోర్ట్ సెయింట్ జార్జ్‌ను శాంథోమ్‌కు అనుసంధానిస్తూ 1845 ప్రాంతంలో ఈ రహదారిని అభివృద్ధి చేశారు.
దీనిని మొదట సౌత్ బీచ్ రోడ్ అనే పిలిచేవారు. గవర్నర్ గ్రాంట్-డఫ్ 1884లో దీనిని ఒక విహార ప్రదేశంగా అభివృద్ధి చేసి, "షోర్" అనే ఇటాలియన్ పదం నుండి "మెరీనా" అని పేరు పెట్టారు.
ఆ తరువాత పేరు మారింది. ఈ రహదారికి తరువాత కామరాజ్ శాలై అని పేరు పెట్టారు. 
నార్త్ బీచ్ రోడ్ కాస్తా రాజాజీ శాలై అయ్యింది.
ఈ రహదారి మద్రాసులోని వాణిజ్య, ఓడరేవు ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందింది.
ఇది పరిపాలనా, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. జనరల్ పోస్ట్ ఆఫీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైకోర్టు వంటి భవనాలు వివిధ కాలాల్లో ఇక్కడ ఉన్నాయి.
ఇతర ముఖ్యమైన అంశాలు
లూప్ రోడ్డు : మెరీనా బీచ్ వెంబడి ప్రత్యేక లూప్ రోడ్డును 1949లో ప్రతిపాదించారు. 1959 నాటికి పూర్తయింది. బీచ్ ఫ్రంట్‌ను అందంగా తీర్చిదిద్దడం, ప్రాంతాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం.
అయితే 1900ల ప్రారంభంలో, మెరీనా బీచ్ రోడ్డు వెంబడి రైల్వే లైన్ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ ప్రజల నిరసనల తర్వాత అది ఆగిపోయింది. 
టూకీగా ఇది బీచ్ రోడ్ కథనం.


కామెంట్‌లు