వింతలు విశేషాలు! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 తేలే గ్రామం*ఫ్లోటింగ్ విలేజ్* అని ప్రసిద్ధిగాంచిన దాని అసలుపేరు*చంపూఖంగ్పోక్* మణిపుర్ లో ఉంది.లోక్టక్ సరస్సులో ఉన్న ద్వీపంని*ఫుమదీ* అని పిలుస్తారు.నీటిపై తేలుతూవెదురుఇళ్లుంటాయి. చేపలపెంపకం ముఖ్య వృత్తి.సోలార్ పానెల్ తో విద్యుత్తు ,సరసులోని నీటితో ప్రశాంత జీవితంగడిపే జనాలు!బయోడైజెస్టర్ టాయిలెట్స్ సౌకర్యాల నడుమ 500  ఇళ్లు 2వేలమంది జనాలున్నారు.ఝార్ఖండ్ లో నేడు మైనింగ్ టూరిజం ఊపందుకుంది.రాంచీ సమీపంలోని ఉరీమారీ గనిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించవచ్చు. గైడ్ సాయంతో 100మీటర్ల లోతుకిదిగి బొగ్గుతవ్వకాన్ని స్వయంగా వీక్షించవచ్చు.సోమ బుధవారాల్లో 10_20మంది ఒకగ్రూప్ గా ఏర్పడి ఈగనిలోకి వెళ్లే ఏర్పాట్లు చేశారు.నవాబ్ హామీద్ అలీఖాన్(1930_1966) రాంపూర్ నవాబు తన మహల్ లోనే ఒకరైల్వే స్టేషన్ నిర్మించాడు. 113 కోట్ల విలువచేసే దాన్ని  అసలుసిసలు రైల్వే స్టేషన్ లాగానే కట్టించాడు.ప్లాట్ఫాం సిగ్నల్, ట్రాక్ తో 40కి.మీ.పొడవురైల్వే లైన్ కేవలం రాచకుటుంబంకోసమే నిర్మించాడు. 4బోగీలరైలులో సోఫాలు డైనింగ్ బెడ్రూమ్,లోపల వెండి బంగారం చెక్క నగిషీలతో తయారుకాబడింది. ఇది ఏరాజు చేయని ఖరీదైన పని! అతను చనిపోయాక  దాన్ని పట్టించుకునే నాధుడులేక శిథిలావస్థలో ఉంది🌹
కామెంట్‌లు