వినరో భాగ్యము విష్ణు కథలు: (5): -ఎం బిందుమాధవి.

 “పరమం యో మహత్తేజ: పరమం యో మహత్తప:
పరమం యో మహద్బ్రహ్మ పరమం య: పరాయణం
పవిత్రాణాం పవిత్రం యో మంగళవారం చ మంగళం
దైవతం దేవతానాంచ భూతానాంయో ఽవ్యయ: పితా”

రవి, పావని పక్క పక్క ఫ్లాటులో ఉంటారు. “విష్ణు సహస్రనామం” ఇద్దరు కలిసే నేర్చుకుంటున్నారు. ఆ ఆన్లైన్ క్లాసు అయ్యాక రవి, పావని కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవటానికి కూర్చున్నారు.
“ఇవ్వాళ శ్లోకాలు నీకు అర్థం అయ్యాయా?”అని అడిగింది పావని.
“నేను రోజు తాతగారితో వాటి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇహం అంటే మనం మన కళ్లతో చూసే భౌతిక విషయాలు. అంటే మనుషులు, జంతువులు, చెట్లు, పక్షులు, క్రిమి కీటకాలు..అలాగే మన పుస్తకాలు, బట్టలు..ఇంకా ఇంట్లో ఉండే కుర్చీలు, టీవీలు అన్న మాట.”
“పరం అంటే ఈ భౌతిక మైన విషయాలన్నిటికీ అవసరమైన చైతన్యాన్ని ఇచ్చి నిలబెట్టేది, నడిపించేది, కాపాడేది. అదే లేకపోతే ఏది కదలదు, పెరగదు. అదే మనం అనుకునే అల్టిమేట్. దానికంటే ఎక్కువైంది, గొప్పది ఇంకేమీ లేదు. కానీ దాన్ని మనం అనుభవించగలమే కానీ భౌతికంగా చూడలేము. ఎలా అంటే గాలి, వెలుతురు, నీళ్ళల్లో ఉండే జీవ శక్తి..అవి మనం చేత్తో పట్టుకోలేం కదా. అలాగే జీవం లేని చెట్టుకి చిగురు రాదు. పువ్వులు పూయదు. కాయలు కాయదు. కరెంట్ లేనిదే బల్బులు వెలగవు, ఫ్యాన్ తిరగదు, ఏసీ పని చేయదు. కరెంట్ ని మనం చూడలేము కదా! అమ్మ అన్నం వండటానికి ఉపయోగించే గ్యాస్ మనకి కనపడదు కదా! కానీ సిలిండర్ లో గ్యాస్ అయిపోగానే స్టవ్ ఆరిపోతుంది”.
“గ్యాస్ భూమిలో నించి పైకి తీస్తారు. కరెంట్..నీళ్ళల్లో ఉండే శక్తినించి కూడా తయారు చేస్తారు. దాన్ని “హైడల్ పవర్” అంటారు. నీటిలో ఉండే శక్తి అంటే.. అందులో కనబడకుండా ఉండే ఖనిజాలు, లవణాలు. వాటి వల్లనే మనం నీటి బరువు తెలుసుకుంటాం. ఆ శక్తి వల్లనే మనం నీటిలో మునిగిపోవటం కూడా జరుగుతుంది. నీకు తెలుసా ప్రపంచంలో “డెడ్ సీ” అంటే “నిర్జీవ సముద్రం” అనేది ఒకటుందని” అన్నాడు రవి ఆరిందా లాగా.
“అవునా..ఆ ‘డెడ్ సీ’ ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి?” అని అడిగింది పావని ఉత్సుకతతో తల ముందుకు పెట్టి!
“అది ‘మిడిల్ ఈస్ట్’ లో జోర్డాన్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉన్నది. దానిలో ఉండే నీళ్ళల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందిట. అందువల్లే ఆ నీళ్లల్లో అసలు మునగరుట..లండన్ లో ఉండే మా కజిన్ వాళ్ళు సెలవుల్లో వెళ్లారుట. వాడే వచ్చి చెప్పాడు. భలే ఆశ్చర్యం కదా! ఇలా మనకి తెలియనివి, తెలిసినా కూడా చూడనివి ఇంకా ఎన్ని ఉన్నాయో” అన్నాడు రవి.
“పరమం యో మహత్తేజ: పరమం యో మహత్తప: అంటే…పైన మనం చెప్పుకున్న అన్నిటిలో ఉండే తేజస్సు, శక్తి కంటే కూడా పై స్థాయి వాడు శ్రీమన్నారాయణుడు. అంటే మనకి ఇంట్లో కరెంట్ సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్ కి కరెంట్ సప్లై చేసే పవర్ హౌస్ లాంటి వాడన్న మాట.”
“పవిత్రం అంటే..శుభ్రం చెయ్యటం. అంటే మనం నీళ్ళు తాగే గ్లాస్, టీ తాగే కప్పు, తినే కంచం నీళ్లతో శుభ్రం చేశాకనే వాడుకుంటాం. అవునా? నీటితో కదా శుభ్రం చేస్తాం..ఆ నీటిలో ఉండే శక్తి గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. అదే పవిత్రం అంటే! మంగళం అంటే..మనకి బాధ, దు:ఖం కలగక పోవటం. అలా పరిశుభ్రం చేసుకోవటానికి అవసరమైన భౌతిక పదార్థాలని, వస్తువులని సమకూర్చేవాడు, వాటిలో శక్తిని నింపేవాడు, అవి నిరంతరం మనకి అందుబాటులో ఉండి సంతోషం కలిగించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు అనే అలౌకికమైన శక్తి అని తాతగారు చెప్పారు. నాకు అర్థమయిందే నీకు చెప్పాను” అన్నాడు రవి.
“సరే..గబ గబా హోమ్ వర్క్ పూర్తి చెయ్యాలి, ఇందాకటి నించి మాట్లాడుకుంటూ ఉంటే టైం గడిచి పోయింది చూసుకోలేదు” అని ఇద్దరూ బుద్ధిగా తమ చదువులో పడ్డారు.
కామెంట్‌లు
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చిత్రం
అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్
చిత్రం
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం