శ్రీమద్భగవద్గీత వ్యాసములు:--7:- -పివిఎల్ సుబ్బారావు-విజయనగరం-9441058797

 అంశము
సాధన ---సాఫల్యము

యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు,
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా**
"సాధనమున పనులు సమకూరు ధరలోన"--- వేమన
"Practice makes
a man perfect "ఆంగ్లసూక్తి. 
ఏ రంగంలోనైనా పరిపూర్ణత సాధించాలి అంటే అలుపెరుగని సాధన ఒక్కటే మార్గము. క్రీడా,కళా ,విద్యా--
-రంగాలలో సాధన బలంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని గతం వర్తమానం రెండు చెపుతున్నాయి. అర్జునుడు విజయుడు అవడానికి పరమాత్ముడు చక్కటి సాధన తెలియజేశాడు. మనం కూడా అలాంటి సాధన చేసి మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలి.!
అర్జునా!
శరీరేంద్రియములను, మనసును స్వాధీన పరుచుకొనిన యోగి ఒంటరిగా నిర్జన ( ఏకాంత) ప్రదేశములో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. మనిషి తాను చేసే పనిలో తనని తాను లగ్నం చేసుకోవాలి. 
పరిశుభ్రమైన ప్రదేశమున క్రమంగా దర్భాసనమును, జింక చర్మమును (సహజముగా మరణించిన జింక చర్మమునే) వాడవలెను. జింక చర్మము లభించనిచో కంబళి ఉపయోగించవచ్చును. వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఆసనముగా ఏర్పరచుకొనవలెను.
ఆ ఆసనము పై కూర్చొని (తిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది అని పెద్దల మాట) జితేంద్రియ వ్యాపారములనువశమునందుంచుకుని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై థ్యానయోగమును సాధన చేయవలెను .
నిత్య జీవితములో మనం చేసే పనులలో--:ఉదా--: చదువుకొనుట, భోజనము చేయుట, లలో మనం కూర్చునే విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని గమనించాలి. శరీరమును శిరస్సు నునిటారుగా నిశ్చలముగా ఉంచి (స్థిర సుఖాసనంలో) చూపులను ఏ దిక్కునకు పోనీక  నాసిక భాగమునందే దృష్టి నిలపవలెను. 
ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయ రహితుడై, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడవై నిశ్చలుడవైఉండవలెను.
చిత్తమునుపూర్తిగా వశమునందుచుకుని స్థిరముగా నిలిపినప్పుడు సాధకుడు సర్వ భోగముల యందును స్పృహ రహితుడగును. అప్పుడతడు యోగ యుక్తుడనబడును.
దుఃఖ రూప సంసారబంధము నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్ సాక్షాత్కార రూపస్థితిని) యోగము అని తెలియవలెను. యోగమును 1దృఢమైన, 2.ఉత్సాహపూరితమైన, 3విసుగులేని చిత్తముతో, 4నిర్భయముగా సాధన చేయవలెను.
భగవంతుని సాక్షాత్కార కోసమే కాదు మన ఆశయ సిద్ధి కోసం చేసే సాధనలో కూడా ఈ నాలుగు లక్షణాలతో సాధన చేయ డము అవసరము.
అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. భగవంతుడిని కాదు ఏది పొందాలన్నా ,అనన్య (పోలిక లేని) ప్రయత్నం అవసరము 
కామ ,క్రోధ ,లోభ ములు-- నరక ద్వారములు
మనజుని అధోగతి పాలు చేయును. కనుక వాటిని త్యజించవలెను.
ఈ మూడింటి నుండి బయట పడిన వాడు శుభకర్మలనే ఆచరించును. అందువలన పరమగతిని అనగా నన్నే పొందును.
భగవంతుడిని పొందిన తర్వాత ఇక పొందవలసినది ఏమున్నది? ఏమి ఉండదు. భౌతికంగా ఎన్ని పొందినా ఇంకా ఏదో పొందాలనే ఉంటుంది.
శాస్త్ర విధిని త్యజించి యధ్ధేచ్ఛగా  (విశృంఖలంగా) ప్రవర్తించువాడు-అనగా చేయవలసిన రీతిలో సాధన చేయనివాడు-- సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభించవు. పరమ గతియు ప్రాప్తించదు.
అర్జునా!
కర్తవ్యా కర్తవ్యము లను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్ర కర్మలను గురించి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపుము.
ఉదా --: బండి , గుర్రము.. గుర్రమును ముందుంచి దాని వెనుక బండి కడితే గుర్రము వెళ్ళే దారిలో బండి వెళ్ళును.
దీనికి భిన్నంగా-: గుర్రమునకు  ఎదురుగా బండి నుంచి కట్టినచో గుర్రముముందుకు పోతుంటే బండి వెనుకకు పోవును.
శాస్త్రము తెలియని సందర్భంలో1 అమ్మ మాట.2 తండ్రి మాట.3 గురువు మాట.4 పెద్దల మాట పరమ ప్రమాణముగా భావించి సాధన, తద్వారా కార్యాచరణ, చేసి తరించవచ్చు ను.
శివాజీ--మాతృవాక్ పాలన, 
శ్రీ రాముడు--పితృవాక్ పాలన, 
శ్రావణకుమారుడు--:-తల్లిదండ్రులను సేవించుట. ఏకలవ్యుడు --:, గురువు బొమ్మనుగురువుగా భావించడం. ధర్మరాజు---: పెద్దల మాట మన్నించుట. 
ఈసాధన సాఫల్యం, ఏదో ఆధ్యాత్మిక రంగానికి పరిమితం కాదు. మనిషి జీవన దశలలో బాల్యము, కౌమారము, యవ్వనము, గృహస్థ జీవితము, వార్ధక్యము ల యందు,, తాను ఏ రంగంలో ఉన్నా (విద్య ,కళా ,క్రీడా ,వృత్తి, ఉద్యోగం ,వ్యాపారం) సాధన ఆయా రంగాలలో మనిషిని ప్రగతి వైపు నడిపించి ,ఆశయసిద్ధిని కలిగించును. తద్వారా వ్యక్తికి  సమాజానికి
దిశా నిర్దేశం జరుగుతాయి. 
దేశాభివృద్ధికి  ఆ దేశ పౌరుల అనన్యసాధనే మూలం. వనరులు ప్రకృతిలో ఉన్నా వానిని వినియోగించి దేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి ప్రయత్నమేఅవశ్యం.
దేశమనెడీదొడ్డవృక్షము;ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చెమటను తడిసిమూలం నేను
ధనం పంటలు పండవలెనోయ్
గురజాడ
దేశభక్తి కవితలో
 ఈ సందేశం సాధన మహిమ వివరిస్తుంది.
_______
ఈ భగవద్గీతలోని సాధన ను అనుసరించిన జీవితము సాఫల్యం కాగలదు.
,________ఈ క్రింది అధ్యాయములలోని శ్లోకముల  భావము పైన వ్రాయబడినది
_______
6--:10,11,12,13,14,18,23,25.;
11:54,55.:
16--:21,22,23,24.'':..
=================================
కామెంట్‌లు
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చిత్రం
అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్
చిత్రం
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం