అంశము
సాధన ---సాఫల్యము
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు,
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా**
"సాధనమున పనులు సమకూరు ధరలోన"--- వేమన
"Practice makes
a man perfect "ఆంగ్లసూక్తి.
ఏ రంగంలోనైనా పరిపూర్ణత సాధించాలి అంటే అలుపెరుగని సాధన ఒక్కటే మార్గము. క్రీడా,కళా ,విద్యా--
-రంగాలలో సాధన బలంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని గతం వర్తమానం రెండు చెపుతున్నాయి. అర్జునుడు విజయుడు అవడానికి పరమాత్ముడు చక్కటి సాధన తెలియజేశాడు. మనం కూడా అలాంటి సాధన చేసి మనం ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలి.!
అర్జునా!
శరీరేంద్రియములను, మనసును స్వాధీన పరుచుకొనిన యోగి ఒంటరిగా నిర్జన ( ఏకాంత) ప్రదేశములో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. మనిషి తాను చేసే పనిలో తనని తాను లగ్నం చేసుకోవాలి.
పరిశుభ్రమైన ప్రదేశమున క్రమంగా దర్భాసనమును, జింక చర్మమును (సహజముగా మరణించిన జింక చర్మమునే) వాడవలెను. జింక చర్మము లభించనిచో కంబళి ఉపయోగించవచ్చును. వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఆసనముగా ఏర్పరచుకొనవలెను.
ఆ ఆసనము పై కూర్చొని (తిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది అని పెద్దల మాట) జితేంద్రియ వ్యాపారములనువశమునందుంచుకుని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై థ్యానయోగమును సాధన చేయవలెను .
నిత్య జీవితములో మనం చేసే పనులలో--:ఉదా--: చదువుకొనుట, భోజనము చేయుట, లలో మనం కూర్చునే విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని గమనించాలి. శరీరమును శిరస్సు నునిటారుగా నిశ్చలముగా ఉంచి (స్థిర సుఖాసనంలో) చూపులను ఏ దిక్కునకు పోనీక నాసిక భాగమునందే దృష్టి నిలపవలెను.
ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయ రహితుడై, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడవై నిశ్చలుడవైఉండవలెను.
చిత్తమునుపూర్తిగా వశమునందుచుకుని స్థిరముగా నిలిపినప్పుడు సాధకుడు సర్వ భోగముల యందును స్పృహ రహితుడగును. అప్పుడతడు యోగ యుక్తుడనబడును.
దుఃఖ రూప సంసారబంధము నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్ సాక్షాత్కార రూపస్థితిని) యోగము అని తెలియవలెను. యోగమును 1దృఢమైన, 2.ఉత్సాహపూరితమైన, 3విసుగులేని చిత్తముతో, 4నిర్భయముగా సాధన చేయవలెను.
భగవంతుని సాక్షాత్కార కోసమే కాదు మన ఆశయ సిద్ధి కోసం చేసే సాధనలో కూడా ఈ నాలుగు లక్షణాలతో సాధన చేయ డము అవసరము.
అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. భగవంతుడిని కాదు ఏది పొందాలన్నా ,అనన్య (పోలిక లేని) ప్రయత్నం అవసరము
కామ ,క్రోధ ,లోభ ములు-- నరక ద్వారములు
మనజుని అధోగతి పాలు చేయును. కనుక వాటిని త్యజించవలెను.
ఈ మూడింటి నుండి బయట పడిన వాడు శుభకర్మలనే ఆచరించును. అందువలన పరమగతిని అనగా నన్నే పొందును.
భగవంతుడిని పొందిన తర్వాత ఇక పొందవలసినది ఏమున్నది? ఏమి ఉండదు. భౌతికంగా ఎన్ని పొందినా ఇంకా ఏదో పొందాలనే ఉంటుంది.
శాస్త్ర విధిని త్యజించి యధ్ధేచ్ఛగా (విశృంఖలంగా) ప్రవర్తించువాడు-అనగా చేయవలసిన రీతిలో సాధన చేయనివాడు-- సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభించవు. పరమ గతియు ప్రాప్తించదు.
అర్జునా!
కర్తవ్యా కర్తవ్యము లను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్ర కర్మలను గురించి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపుము.
ఉదా --: బండి , గుర్రము.. గుర్రమును ముందుంచి దాని వెనుక బండి కడితే గుర్రము వెళ్ళే దారిలో బండి వెళ్ళును.
దీనికి భిన్నంగా-: గుర్రమునకు ఎదురుగా బండి నుంచి కట్టినచో గుర్రముముందుకు పోతుంటే బండి వెనుకకు పోవును.
శాస్త్రము తెలియని సందర్భంలో1 అమ్మ మాట.2 తండ్రి మాట.3 గురువు మాట.4 పెద్దల మాట పరమ ప్రమాణముగా భావించి సాధన, తద్వారా కార్యాచరణ, చేసి తరించవచ్చు ను.
శివాజీ--మాతృవాక్ పాలన,
శ్రీ రాముడు--పితృవాక్ పాలన,
శ్రావణకుమారుడు--:-తల్లిదండ్రులను సేవించుట. ఏకలవ్యుడు --:, గురువు బొమ్మనుగురువుగా భావించడం. ధర్మరాజు---: పెద్దల మాట మన్నించుట.
ఈసాధన సాఫల్యం, ఏదో ఆధ్యాత్మిక రంగానికి పరిమితం కాదు. మనిషి జీవన దశలలో బాల్యము, కౌమారము, యవ్వనము, గృహస్థ జీవితము, వార్ధక్యము ల యందు,, తాను ఏ రంగంలో ఉన్నా (విద్య ,కళా ,క్రీడా ,వృత్తి, ఉద్యోగం ,వ్యాపారం) సాధన ఆయా రంగాలలో మనిషిని ప్రగతి వైపు నడిపించి ,ఆశయసిద్ధిని కలిగించును. తద్వారా వ్యక్తికి సమాజానికి
దిశా నిర్దేశం జరుగుతాయి.
దేశాభివృద్ధికి ఆ దేశ పౌరుల అనన్యసాధనే మూలం. వనరులు ప్రకృతిలో ఉన్నా వానిని వినియోగించి దేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి ప్రయత్నమేఅవశ్యం.
దేశమనెడీదొడ్డవృక్షము;ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చెమటను తడిసిమూలం నేను
ధనం పంటలు పండవలెనోయ్
గురజాడ
దేశభక్తి కవితలో
ఈ సందేశం సాధన మహిమ వివరిస్తుంది.
_______
ఈ భగవద్గీతలోని సాధన ను అనుసరించిన జీవితము సాఫల్యం కాగలదు.
,________ఈ క్రింది అధ్యాయములలోని శ్లోకముల భావము పైన వ్రాయబడినది
_______
6--:10,11,12,13,14,18,23,25.;
11:54,55.:
16--:21,22,23,24.'':..
=================================

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి