చరిత్ర పుటలో క్యాలండర్ :- - యామిజాల జగదీశ్

 ఆంగ్ల నామ సంవత్సరం జనవరి 1తో మొదలవుతుంది.‌ ఇది మన నూతన సంవత్సరం కాదని, ఉగాది నుంచే మనకు కొత్త ఏడాది అని ఎంతలా చెప్పుకున్నా అందరితో పాటు  ఈ జనవరి ఒకటితో కూడిన క్యాలండరునే అనుసరించక తప్పదు.  గ్రెగోరియన్ క్యాలెండర్ మొదటి రోజు. ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఈరోజు సెలవుదినం కూడా.
క్యాలెండర్ చరిత్ర...
1582 లో పోప్ గ్రెగొరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. ఇది సౌర మాన ప్రకారం రూపొందించినది. క్రీస్తుపూర్వం 45లో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ శ్రీకారం చుట్టిన జూలియన్ క్యాలెండర్‌ను సంస్కరించింది.
రోమ్ స్థాపకుడు రోములస్, క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దంలో ప్రారంభ రోమన్ క్యాలెండర్‌ను రూపొందించాడు. నుమా పాంపిలియస్ జనవరి - ఫిబ్రవరి నెలలను జోడించి , దానిని 12 నెలల సంవత్సరంగా మార్చాడు.
ఇరానియన్ కవి, తత్వవేత్త అయిన ఒమర్ ఖయ్యామ్ కూడా ఒక జ్యోతిష్కుడు. లీపు సంవత్సరానికి నియమాలను రూపొందించాడు.
భారతదేశంలో 
గ్రెగోరియన్ క్యాలెండర్ రాక
గ్రెగోరియన్ క్యాలెండర్ 1752 లో భారతదేశానికి ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం గ్రేట్ బ్రిటన్ దీనిని స్వీకరించింది.
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా పంచాంగాలు అని పిలువబడే భారతీయ క్యాలెండర్లు విస్తృతంగా వాడుకలో ఉండటం గమనార్హం.
భారతదేశం స్వాతంత్ర్యం పొందే సమయానికి, గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రభుత్వం, అనేక ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించారు. కానీ వివిధ ప్రాంతీయ క్యాలెండర్‌లను ఉపయోగించడమూ కొనసాగింది.
భారతదేశం, పాకిస్తాన్, మయన్మార్, ఇజ్రాయెల్ వంటి దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌తో పాటు సాంప్రదాయ క్యాలెండర్‌లను ఉపయోగించటం విదితమే.
విక్రమ్ సంవత్ చంద్ర సౌర క్రీ.పూ 57 దీనిని ప్రారంభించినట్లు భావిస్తున్న రాజు విక్రమాదిత్యుడి పేరు మీద దీనికి పేరు పెట్టారు. నేపాల్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పండుగలు, సాంప్రదాయ కార్యక్రమాలను జరుపుకోవడానికి ఉపయోగిస్తారు.
శక సంవత్ సౌర 78 క్రీ.శ. శాలివాహన చక్రవర్తి భారతదేశ అధికారిక జాతీయ క్యాలెండర్.
కొన్ని ప్రాంతాలలో అధికారిక ప్రయోజనాల కోసం, సాంప్రదాయ పద్ధతుల కోసం ఉపయోగించడం జరుగుతోంది.
గ్రెగోరియన్ క్యాలెండర్ సౌర 1582 క్రీ.శ. జూలియన్ క్యాలెండర్‌లోని తప్పులను పరిష్కరించడానికి పోప్ గ్రెగొరీ XIII అంతర్జాతీయ ప్రామాణిక క్యాలెండర్, ప్రపంచవ్యాప్తంగా పౌర, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటారు.
విక్రమ్ సంవత్ 57 BC లో ప్రవేశపెట్టారు. కాబట్టి, విక్రమ్ సంవత్ సంవత్సరం నుండి 57 తీసివేస్తే, మనకు క్రైస్తవ సంవత్సరం వస్తుంది.
ఉదా. VS 2054 – 57 = AD 1997.
శక సంవత్ లేదా యుగం BC 78 లో శక క్షత్రప్ నహ్పన్ కాలంలో ప్రారంభమైంది. 
శక సంవత్సరానికి 78ని కలిపితే, మనకు క్రైస్తవ సంవత్సరం వస్తుంది. ఉదా. శక 1752 + 78 = AD 1830.
విక్రమ్ సంవత్, శక సంవత్ భారతదేశంలో రెండు ప్రధాన క్యాలెండర్లు. దీపావళి, హోలీ వంటి అన్ని హిందూ పండుగల తేదీలను లెక్కించడానికి వీటిని ఉపయోగిస్తారు.
శక శకాన్ని కుషాణ రాజు కనిష్కుడు స్థాపించాడని నమ్మిక. శక జాతీయ క్యాలెండర్ ప్రకారం, నూతన సంవత్సరం సాధారణ సంవత్సరానికి మార్చి 22 న, లీపు సంవత్సరానికి మార్చి 23 న వస్తుంది. ఈ క్యాలెండర్‌కు సంవత్సరం 0 అనేది 78 CEలో వసంత విషువత్తు (పగలు, రాత్రి సమానంగా ఉన్నప్పుడు).
1952లో, భారతదేశం తన క్యాలెండర్‌ను సంస్కరించాలని నిర్ణయించుకుంది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (CSIR) నుండి సహాయం కోరింది.
CSIR నవంబర్ 1952 లో ప్రొఫెసర్ మేఘనాథ్ సాహా అధ్యక్షతన ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు సభ్యులుగా ఒక క్యాలెండర్ సంస్కరణ కమిటీని నియమించింది.
మూడు సంవత్సరాల అధ్యయనం తర్వాత, ఆ కమిటీ శాస్త్రీయ విధానం ఆధారంగా ఏకీకృత భారతీయ క్యాలెండర్‌ను ప్రతిపాదించింది. ఆ కమిటీ నివేదికను 1955లో CSIRకి సమర్పించారు. ఈ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది.
ఏకీకృత జాతీయ క్యాలెండర్ శక శకం ఆధారంగా రూపొందించారు. చైత్రం దాని మొదటి నెలగా, 365 రోజుల సాధారణ సంవత్సరంగా ఉంటుంది. దీనిని గ్రెగోరియన్ క్యాలెండర్‌తో పాటు మార్చి 22 , 1957న కింద అధికారిక ప్రయోజనాల కోసం స్వీకరించారు.
భారతదేశ జాతీయ క్యాలెండర్ ప్రకారం, మార్చి 22 (లేదా లీపు సంవత్సరంలో అయితే మార్చి 21 ) సంవత్సరంలో మొదటి రోజు.

కామెంట్‌లు