ఏడుపదుల వయస్సులో అనుకున్నా:- కవిమిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -హైదరాబాద్.
బాల్యంలో పుట్టినరోజన జన్మనిచ్చిన మాతృమూర్తి
నూనెపెట్టి వళ్ళు నలచి
తలంటు స్నానం చేయించి
నుదుట విభూతి బొట్టు పెట్టి  
దిష్టి తీసి బాల సుబ్రహ్మణ్య స్వామిలా ఉన్నవని 
మురిసి ముద్దాడి దిష్టి తీసినది జ్ఞాపకమే.!!

వివాహమైన తరువాత
సహధర్మచారిణి  జన్మదినాన నూనె పెట్టి   
తలరుద్ది విభూతితో బాటు బొట్టుపెట్టి మన్మథుడు 
మీముందు దిగదుడుపే అని ఆప్యాయంగా 
కౌగిలించుకున్నది మరువలేను...!!

మనుమలనెత్తిన నాతో
జన్మకు కారణమైన మీరు
నా ఉన్నతికి కారణమని
నాన్నా నేను మీకు అభ్యంగన 
స్నానం చేయిస్తానని నా సప్తతి నాడు
వణుకుతున్న నా చేయిని తీసుకు షా0పు తో 
తలంటి విభూతి స్టిక్కర్ బొట్టుపెట్టి
నా ధర్మపత్ని దగ్గరకు తీసుకొని వెళ్ళి కూర్చుండబెట్టి
మీరివురు  నా పాలిట 
ఆది దంపతులని మనుమలతో భర్తతో కలసి
నమస్కరించిన నా తనయను చూసి
నేననుకున్నా నా జీవితం ధన్యమన్నది.
వారుమువ్వురు 
నాకు దేముడు ప్రసాదించిన పరదేవతమూర్తులే..!!

(3-12-25 నా సప్తతి సందర్భంగా వ్రాసిన కవిత)
...........................


కామెంట్‌లు