రవీంద్రభారతిలో కవి, రచయిత అయ్యలసోమయాజులకు ఘన సత్కారం.
  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ  గౌతమబుద్ధ ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో  వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీమతి కోగంటి ఉషారాణి మరియు కోగంటి శాంతిశ్రీ సోదరీమణులు కళారత్న  డాక్టర్ బిక్కికృష్ణ అధ్యక్షతన  జరిగిన  సరస్వతీ సభలో కవి, గాయకుడు అరవా రవీంద్ర నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రముఖకవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం  'మరో గౌతమబుద్ధుడు డాక్టర్ అంబేద్కర్ 'అని కవితాగానం చేయగా ముఖ్య అతిథులు విమల సాహితీఅధ్యక్షులు డాక్టర్ జెల్ది విద్యాధర్ ఐ.ఆర్ ఎస్.ప్రసిద్ధ గజల్ రచయిత్రి  విశ్వశ్రీ డాక్టర్ విజయ లక్ష్మి పండిట్, ప్రముఖ కవి  సుందరయ్య, ప్రముఖ కవి వాల్మీకి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వి.డి. రాజగోపాల్, కవియత్రి డాక్టర్ రాధకుసుమ  విశిష్ట అతిథులు  పద్మశ్రీ  ఆచార్య కొలకులూరి ఇనాక్ పూర్వ ఉపకులపతి యస్. వి.యు. ప్రసిద్ధతత్వ వేత్త  పూర్వ తెలంగాణ బి.సి కార్పోరేషన్ చైర్మన్  కవి బి.సి.రాములు గారి సమక్షంలో  సరస్వతీ సభలో దుశ్శాలువ అభినందన ప్రశంసా పత్రంతో సత్కరించారు.

బదులుగా  ప్రసాద్ మాష్టారు రాజ్యాంగ శిల్పి  డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి నాడు భాగ్యనగరంలో రవీంద్రభారతి లో  కవులు సాహితీవేత్తల మధ్య జరిగిన సత్కారం మరువలేనిదని చెప్పారు.
కామెంట్‌లు