"వానరులు":- - యామిజాల జగదీశ్
 ఆంజనేయుడి తోక మీద ఉన్న గంట రహస్యమేమిటో చూద్దాం....
రామాయణంలో ఆంజనేయుడికి, కుంభకర్ణునికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇందులో కుంభకర్ణుడి రథం నుండి ఒక పెద్ద గంట కిందపడిపోతుంది. 
అప్పుడు ఆ గంట యుద్ధభూమిలో ఉన్న సింహాలికులు అనే చిన్నపాటి కోతులపై పడుతుంది. దాంతో కోతులన్నీ భయపడతాయి. గంట లోపల ఉన్న ఒక చిన్న సింహాలిక కోతి, "మనం శ్రీరాముడిని స్తుతిస్తే, మనకు మంచి జరుగుతుంది" అని చెబుతుంది. 
వెంటనే అన్ని కోతులూ రామ నామాన్ని జపిస్తాయి. 
యుద్ధం ముగిసిన తర్వాత, హనుమంతుడు, రాముడు తప్పిపోయిన కోతులను వెతుకుతూ యుద్ధభూమికి వస్తారు. 
కానీ ఎంత వెతికినా కోతులు కనిపించవు. 
అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద గంటను చూసి వెంటనే తన తోకతో దానిని పైకెత్తుతాడు. 
సింహాలిక కోతులు దాని నుండి బయటకు వస్తాయి. 
ఇదంతా చూసిన శ్రీరాముడు కూడా సంతోషిస్తాడు. 
తన తోకతో కోతులను రక్షించిన గుర్తుగా ఆ గంట ఆంజనేయుడి తోకపై ఉంది. 
ఇక్కడో విషయం గమనించాలి.
"సింహలిక" అనే పదం ఇతిహాసంలో కోతుల జాతిని సూచించదు. శ్రీరాముడి సైన్యాన్ని ఏర్పాటు చేసిన కోతుల లాంటి పాత్రలు వానరులు. వానరులను అడవిలో నివసించే హ్యూమనాయిడ్‌లు లేదా బొచ్చు, తోకలు వంటి కోతి లాంటి లక్షణాలు కలిగిన అర్ధ-దైవిక జీవులుగా వర్ణించారు. సంస్కృత పదం వానర అంటే "అటవీ నివాసి" అని అర్థం (వాన అంటే అడవి, నర అంటే మనిషి).




కామెంట్‌లు