ప్రపంచ మహాసభల వేదికపై తిరుమలరావుకు సన్మానం

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో అరుదైన గౌరవాన్ని పొంచారు. మాస్ట్రో డా.గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో గుంటూరులో నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలలో భాగంగా శ్రీ జాషువా కరుణశ్రీ కవిసమ్మేళన వేదికపై  తిరుమలరావు స్వీయ గీతాన్ని ఆలపించి అందరి అభినందనలు పొందారు. అనంతరం శాలువా మెడల్ ప్రశంసాపత్రంలతో సమన్వయకర్తలు కొల్లి రమావతి, మల్లెతీగ కలిమిశ్రీ, ఎస్.ఎన్.ఎస్.కొల్లూరు, కొత్తగూడెం రాజేష్, భీమవరం శైలజా సునంద్, శ్రీసుధ కొలచిన, పురం సుధాంశ్ తదితర ప్రముఖులు ఘనంగా సన్మానించారు. 
72సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో తిరుమలరావు ఆహ్వానం అందుకొని, రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని సన్మానం పొందారు. తెలుగు భాషా సంస్కృతి, పరిరక్షణ, అభివృద్ధి మరియు విశ్వవ్యాప్తి లక్ష్యంగా నిర్వహించిన ఈ ప్రపంచ తెలుగు మహా సభల్లో తెలుగు సంఘాల ముఖ్య సమన్వయకర్త కొల్లి రమావతి, ఈ మహాసభల ముఖ్య సమన్వయకర్త పెన్మత్స రామచంద్రరావుల సమన్వయంతో జరిగిన కవిసమ్మేళనంలో గగనమంత అనుభూతి గజల్స్ స్వర గీతి అనే గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ ప్రముఖ సామాజికవేత్త, కళాకారులు, దర్శకులైన రౌతు వాసుదేవరావు స్వరకల్పన వహించగా గజల్స్ కళ గురించి తన రచనను గీతంగా వినిపించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షలమంది తెలుగు భాషాభిమానులు సాహిత్య సాంస్కృతిక ప్రముఖులు హాజరౌతున్న ఈ కవుల మహాసభలకు తనకు ఆహ్వానం రావడం, కవి సమ్మేళనంలో సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గుంటూరు సాయి బొమ్మిడాల నగర్, ఏటుకూరు హైవే ప్రాంగణం, స్పిరిచువల్ సిటీ సెంటర్ లో నందమూరి తారక రామారావు వేదికపై, మరో ఐదు వేదికలపై ఈ సంబరాలు నిర్వహించుచున్నారని తిరుమలరావు తెలిపారు. తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటే వేడుక ఈ మహాసభలని ఆయన అన్నారు. ఆంధ్రమేవజయతే అనే నినాదంతో నభూతో నభవిష్యతి అనిపించేలా కుంభమేళాను తలపించేలా అతిరథ మహారథుల సమక్షాన ఈ మహాసభలు జరుగుతున్నాయని తిరుమలరావు ఆనందం వ్యక్తం చేసారు. తెలుగు జాతిని విశ్వానికి చాటిచెప్పిన నందమూరి తారకరామారావు వేదిక కార్యక్రమ ఆవశ్యకతను చాటే ప్రధానవేదిక కాగా, హస్తకళలనాణెముల తాళపత్రాల శిల్పారామాల ఆర్ట్ మ్యూజియంలను ప్రదర్శించే చెరుకూరి రామోజీరావు వేదిక, వెయ్యి మంది కవులతో కవి సమ్మేళనంగా శ్రీ జాషువా కరుణశ్రీ వేదిక, పద్యం గద్యం అవధానాలు నిర్వహించేలా శ్రీనాథ మహాకవి వేదిక, పాడరా తెలుగు పాట అనే సందేశంతో ఘంటసాల వెంకటేశ్వరరావు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వేదిక, మఠాధిపతులు, అఘోరాలు, పీఠాధిపతులతో శ్రీనివాస కల్యాణం వంటి అంశాలతో పాటు చాగంటి కోటేశ్వరరావు గరికపాటి నరసింహారావు వంటి వారి ప్రవచనాలతో ఆద్యాత్మిక శోభను సంతరించుకునేలా మరికొన్ని కార్యక్రమాలు ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారని తిరుమలరావు తెలిపారు. అమ్మ నాకు ఆస్తి ఏమి ఇచ్చింది అనేది కాదు, అమ్మ నాకు భాష ఇచ్చిందని మనమంతా సగర్వంగా చాటి చెప్పేలా ఈ సభలు నిలుస్తాయని అన్నారు. భాషే మోసుకెళ్తాను కాటి దాకా అంటూ దృడమైన భావన ప్రతి తెలుగువారిలో ఉండాలనేది ఈ మహాసభల ప్రధాన భూమిక అని కుదమ తిరుమలరావు అన్నారు. అమరావతి రాజధాని పరీవాహక ప్రాంతమంతా ప్రతినోటా తెలుగు మాట హోరెత్తించునని ఆయన అన్నారు. మూడొందలకూ పైబడి తెలుగు ప్రముఖుల చిత్ర పటాలతో వారి జీవితచరిత్రలను తెలిపే ప్రదర్శన ఈ మహాసభల ప్రత్యేకతని కూడా ఆయన అన్నారు. రసరాజు రచన గజల్ శ్రీనివాస్ గానామృతంతో అన్ని దేవాలయాల గురించి వివరిస్తూ క్షేత్ర దర్శిని, తెలుగు తోరణం వంటి గొప్ప కార్యక్రమాలు ఈ మహాసభలలో చోటుచేసుకున్నాయని తిరుమలరావు అన్నారు. మూడు రోజుల పాటు మూడు పూటలా మధ్యాహ్న భోజనం, అల్పాహారాలతో ఆతిథ్యం ఇచ్చుచుండగా ఆ భోజన స్టాల్ లకు కూడా డొక్కా సీతమ్మ, పింగళి వెంకయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి పేర్లు పెట్టీ తెలుగు మహనీయులను స్మరిస్తూ ఈ సభల నిర్వహణ జరిగిందని ఆయన అన్నారు. అంతే కాకుండా మహనీయుల కుటుంబ సభ్యులకు మహా పూర్ణ కుంభ పురస్కారాలను  అందజేయడంతో పాటు, అందరి ప్రతిభకూ పట్టం కట్టారని తిరుమలరావు తెలిపారు. 1994 ప్రపంచ తెలుగు మహాసభలు మద్రాస్ లో నిర్వహించినపుడు కళ్ళు అనే కవిత ద్వారా పురస్కారం పొందిన తిరుమలరావు, తన రచనలతో సహస్ర కవిమిత్ర, తెలుగు తేజం, తెలుగు దీప్తి, గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం, కాళోజీ నారాయణరావు, ఆంధ్ర సాహిత్య రత్న పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 
కవితల, కథల, సప్తపదుల, అష్టాక్షరీ, సుభాషితాల, వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పలు సార్లు విజేతగా నిలిచారు. ఇటీవల సాహితీ విలువలతో కూడిన తపస్వి మనోహరం సంకలనానికి ముఖచిత్రంపై తిరుమలరావును నిలిపి గొప్ప విశిష్టతతో కూడిన గౌరవాన్ని పొందారు.  ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన హమ్ ఫర్ నేచర్ పాటల పోటీలో స్వీయ గీతాన్ని ఆలపించి విజేతగా నిలిచిన తిరుమలరావు, నేడు ప్రపంచ స్థాయి వేదికపై సన్మానం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చిత్రం
అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్
చిత్రం
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం