మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, కస్తూరి బా గాంధీ దంపతులు బొంబాయి లో 1915 జనవరి 9 న అడుగుపెట్టి 111 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వ్యాసం ...భారత మాత పులకించిన రోజు... భారతీయులు సంబరపడే శుభదినం.
వృత్తి రీత్యా దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ , అక్కడ జాత్యహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ వలస కార్మికుల, ప్రజల పక్షాన పోరాడి సత్యాగ్రహం వంటి విధానాలతో పోరాడి కొన్ని విజయాలు సాధించి, ఆ అనుభవాలతో భారతదేశంలో అడుగిడిన రోజు ఈనాడే.
భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించగలరని ప్రజలు భావించడంతో గాంధీజీ దంపతులకు ముంబాయి లో ఘన స్వాగతం లభించింది.
అయితే, వాస్తవానికి గాంధీజీ దక్షిణాఫ్రికా విడిచి 1914 లో ఇంగ్లాండ్ చేరుకొన్నారు. మొదటి ప్రపంచ యుద్ద ప్రారంభ సమయం కావడం, చల్లని వాతావరణం ఇబ్బంది పెట్టడం తో అనుకున్న దానికంటే ముందుగానే ఇంగ్లాండ్ నుండి బయలు దేరి భారత దేశం చేరుకున్నారు.
ఆయన వెంటనే స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించగలరని భావించినా, స్నేహితుల సలహాపై భారతదేశం అంతటా పర్యటించారు. భారతీయుల సామాజిక, ఆర్థిక, విద్య, భావోద్వేగ, సాంస్కృతిక రంగాల్లో భారతీయుల స్థితి గతులను గాంధీజీ ఈ సుదీర్ఘ పర్యటనలో అవగతం చేసుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం లో తన పాత్రను నిర్ధారించుకున్నారు. భారత జాతి అడుగడుగునా ఆయనకు స్వాగతం పలికింది. ఈ సమయంలోనే తొలి తరం స్వాతంత్ర్య సమరయోధులనేకులు గాంధీజీ అనుచరులైనారు. చంపారన్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ నూలు మిల్లుల కార్మికుల పోరాటానికి సంఘీభావం వంటి చర్యలకు గాంధీజీ ఉపక్రమించగలిగారు.
ముందుకురిగారు. సమస్త భారతావనిని కలుపుకుని భారతమాత దాస్యశృంఖాలను తృంచి మహాత్ముడయ్యారు. ఏ పయనానికైనా తొలి అడుగు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్లే... గాంధీజీ 111 సంవత్సరాల క్రితం భారతావని లో అడుగిడిన ఈ దినం చిరస్మరణీయం.
గాంధీ : చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది,-జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
• T. VEDANTA SURY


addComments
కామెంట్ను పోస్ట్ చేయండి