గొప్ప సంఘసంస్కర్త విద్యావేత్త సావిత్రిబాయి : - నామ వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం

 అణగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు వర్గాల బాంధవుడు, పీడిత వర్గాల పితామహుడు,విద్యా వేత్త, ఆనాడు తన సంఘ  సేవా కార్యక్రమాల ద్వారా, ఆనాటి ప్రజల చేత, బ్రిటిష్  ప్రభుత్వం చేత  భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహాత్మా అని పిలిపించుకున్న మహనీయుడు జ్యోతిబాపూలే గారి యొక్క సతీమణి, కవయిత్రి,  రచయిత్రి, సంఘసంస్కర్త,క్రాంతి జ్యోతి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలి సావిత్రిబాయి పూలే గారి యొక్క 195వ జయంతి శుభాకాంక్షలు అందరికి. 
       
🌹:-1931 జనవరి 3 న మహారాష్ట్రలోని నైగావు గ్రామంలో జన్మించింది. చిన్నప్పటి నుండి చాలా అల్లరి పిల్లగా పెరిగింది. ఒకరోజు చెట్టు ఎక్కి జారిపడి కొమ్మ పట్టుకుని కిందికి జారింది. అది చూసి, ఆమె అల్లరి తట్టుకోలేక ఒక రోజు వాళ్ళ అమ్మ  ఈ పిల్లకు ఎంత తొందరగా పెళ్లి చేసి పంపిస్తే అంత మంచిదని, ఇలానే ఉంటే ఏ కాలో చేయో విరిగితే ఎవరు చేసుకుంటారు. లేకపోతే ఇంట్లోనే పడి ఉంటుంది అని అనేది. అప్పుడు సావిత్రిబాయి పూలే, అయితే నాలాగాచెట్లెక్కుతాడా, బయట మంచం మీద పడుకుని, చుక్కలు లెక్క పెడతాడా! అనితల్లితో అనేది.                                            
          అప్పుడు ఆవిడకు తొమ్మిదవ ఏట, 11 సంవత్సరాలు కలిగిన జ్యోతిబాపూలే గారితో వివాహం జరిగింది. వివాహం ఆయన దగ్గర నుంచి సావిత్రిబాయి గారు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసేది. గారు చేసిన సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించేది. వారి కంటే ముందు సమాజంలో స్త్రీకి అట్టడుగు స్థాయి అవకాశాలు ఇచ్చేది. ఆనాటి సమాజంలో తక్కువ వర్ణాలైన శూద్రులతో పాటు స్త్రీలకు చదువుకునే హక్కు లేకుండేది. ఆ కాలంలో బ్రిటీష్ వారు మనకు ఒక మేలు చేయడం జరిగింది. అందరికీ చదువుకొనే అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ సమయంలోనే  జ్యోతి బా పూలేగారు అలాంటి బ్రాహ్మణ వర్గాన్ని ఎదిరించి పాఠశాలకు వెళ్లి చదువుకోవడం జరిగింది. తెలంగాణలో అతనికి ఎన్నో కష్టాలు పెట్టారు. ఆ తర్వాత అతను సమాజంలో అట్టడుగు వర్గాల వాడల్లోకి వెళ్లి, వైద్యం చేసేవారు. ఆ సమయంలోనే వారు వెనుకబడడానికి కారణం వారికి చదువు కోకపోవడమే కారణమని గుర్తించి వాళ్ళుకు చదువు నేర్పాలనుకున్నాడు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా  కొంతమంది బ్రాహ్మణ మిత్రుల సహకారంతో బాలికలకు,  స్త్రీలకు, చదువు చెప్పడానికి పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో అలాంటి బ్రాహ్మణ వర్గం అనేక రకాలుగా కొట్టడం తిట్టడం బెదిరించడం  ఇంకా అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. కొన్ని రోజుల వరకు సాఫీగానే సాగుతున్న సమయంలో  ఒక రోజు పులి గారు చాలా దీనంగా నీరసంగా ఇంటికి వచ్చాడు. సావిత్రిబాయి గారు నీళ్లుగానే కడుక్కొని కూర్చున్నాడు. తనని గమనించిన సావిత్రిబాయి గారు ఏమైంది ఈరోజు ఇంత నీరసంగా ఉన్నారు అని అడిగింది. అతని ఏం లేదులే అని ఆమెను ఊరుకో పెట్టాడు. సావిత్రిబాయి గారు మరోసారి అతనిని అడిగింది. అయినా అతను ఏమి చెప్పలేదు. రాత్రంతా ఆలోచించి, ఏం లేవగానే సావిత్రిబాయితో, సరళ బోధించడానికి వచ్చిన ఉపాధ్యాయులను, బ్రాహ్మణ వర్గాలు బెదిరించి కొట్టాయి. బోధించడానికి రావడం లేదు.  నువ్వు పాఠశాలలో బోధించడానికి రావాలి  అని ఆమెతో అంటాడు. నాకు చదువు రాదు కదా నేను ఎట్లా బోధిస్తాను అని సావిత్రిబాయి గారు పూలే గారితో అనడం జరిగింది.  నీకు నేను చదువు నేర్పిస్తాను ఎలా బోధించాలో చెప్తాను అని ఆ రోజు నుంచి ఆవిడకు చదువు నేర్పడం మొదలుపెడతాడు. చదువు వచ్చిన కొన్ని రోజులకు ఆమెకు చరిత్ర భూగోళం అర్థశాస్త్రం, సాహిత్యాన్ని బోధిస్తాడు, ఆవిడ చాలా ఆసక్తిగా నేర్చుకుంటుంది. పోతిగా నేర్చుకున్న తర్వాత ఆవిడ ఆ పాఠశాలలో చదువు చెప్పడానికి వెళుతుంది. అలా వెళ్తున్నటువంటి సావిత్రిబాయి గారి మీద ఆడి బ్రాహ్మణ వర్గం ఎండనీళ్లు,  బురద నీళ్లు చల్లడం, రాళ్లు విసరడం చేసేవారు. అయినా ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా, వర్షాలకు రోజు రెండు చీరలు తీసుకొని వెళ్ళేది. కట్టుకొని పోయిన చీర మీద ఈ మలినాలని వేస్తే వెళ్ళిన తర్వాత మార్చుకునేది. అయినా గాని ఒక్కదానికి బోధించడం కష్టం అయ్యేది. అప్పుడు అక్కడనే ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళ ఫాతిమా షేక్, తన పాఠశాలకు భవనం ఇవ్వడమే కాకుండా, తను కూడా ఆ పాఠశాలలో బోధించడానికి వచ్చేది, ఆ పాఠశాలలో బోధించిన రెండవ ఉపాధ్యాయిని. తర్వాత వారిద్దరూ దేదీప్యమానంగా  బోధిస్తున్నారు. దాదాపు 30 పాఠశాలకు పైగా స్థాపించి, వాటిలో గారిని వర్గాల స్త్రీలు పిల్లలకి కాకుండా, బ్రాహ్మణ స్త్రీలకు కూడా విద్యా బోధన సాగించేవారు. అదేవిధంగా పూలే గారు స్థాపించినటువంటి సత్యశోధకు సమాజాన్ని, చాలా చక్కగా నిర్వహించేది. అతను చేసే ప్రతి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది. ఒకవైపు పాఠశాలలో బోధన, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి పూణేలో ప్లేగు వ్యాధి సంభవించడం జరిగింది. అక్కడ అందరికంటే  బాగా బాధపడుతున్నటువంటి వారు అణగారిన వర్గాలు. వారిని దగ్గర తీసి వైద్యం చేసే వారు ఎవరూ లేకపోవడం పూలే గారు గుర్తించారు, వెంటనే తను తన భార్య సావిత్రిబాయి తో కలిసి, నీ ఊరి బయటకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. తర్వాత కొన్ని రోజులకు ప్లేగు వ్యాధి సోకి పూలే గారు కూడా మరణించడం జరిగింది. ఆ తర్వాత పాఠశాలతో పాటు సామాజిక కార్యక్రమాలన్నీ తన త పుత్రుడి సహాయంతో  పూలే గారే నిర్వహించేది. అయితే అంతకుముందే ఆదర్శప్రాయాలు అయినటువంటి పోలీస్ సావిత్రిబాయి గారు సామాజిక సేవ  చేయుటకు పిల్లలు ఉంటే కష్టమవుతుందని పిల్లలు లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకే వారు ఒక  బ్రాహ్మణ బాల్య వితంతు చనిపోతే ఆమెకు  పుట్టిన బిడ్డని తీసుకొని పెంచుకుంటారు. అతని డాక్టర్ చదివిస్తారు. అతని పేరు యశ్వంత్. ఇంకా ఆ ప్లేగు వ్యాధి మహమ్మారి పూనాని వదలకుండా ఇస్తూనే ఉంది. అయితే ఒక రోజు ఆనగారిన వర్గాల వీధులలో సావిత్రిబాయి గారు వెళుతుంటే, ఒక గుడిసెలో ఒక పిల్లవాడు ఒడి తిరుగుతూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఎవరు అతన్ని పట్టించుకోవడం లేదు, ఎందుకంటే ఆ వ్యాధి అంటువ్యాధి అది వీళ్ళకి కూడా సోకి చనిపోతానేమోనని భయం వలన. అయితే సావిత్రిబాయి గారు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని, పెంపుడు కుమారుడైనటువంటి యశ్వంత్ దగ్గరకు తీసుకువెళ్లి ఇతనికి వైద్యం చేయమని చెబుతుంది. ఇప్పుడు అతను అమ్మ నువ్వు ఇతని ఎత్తుకొస్తే నీకు అంటువ్యాధి సోకుతుంది కదా అంటాడు. అయినా పర్వాలేదా చిన్న పిల్లవాడు పడుతూ చావడం నాకు మంచి గనింపిచలేదు. అందుకే నువ్వు అతనికి వైద్యం చేయమని కోరుతుంది. అప్పుడు వైద్యం చేసి ఆ పిల్లవాని అతడు బతికిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు  సావిత్రిబాయి గారు పులి లాగానే ప్లేగు వ్యాధితో1897 చనిపోతుంది. చనిపోయే ముందే తన కుమారునికి ఈ సేవా కార్యక్రమాలు చేయమని అప్పగిస్తుంది. ఇలా తన జీవితాన్ని లెక్కచేయకుండా నిస్వార్ధంగా ప్రజలే తన పిల్లలుగా భావించి, అట్టడుగు వర్గాల యొక్క బాగు కోసం నిరంతరము శ్రమించే సేవ చేసినటువంటి మహనీయురాలు జ్యోతిబాపూలే. రోజుల్లో ఇలా నిస్వార్ధంగా సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆమె చేసినటువంటి సేవ కార్యక్రమాలు ఫలితంగానే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అందరికీ అన్ని రకాలైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. అందుకే ఈరోజు  అన్ని రకాల వర్గాలు చదువు తో పాటు అన్ని రకాలైనటువంటి పనులు చేసుకోగలుగుతున్నారు. ఈరోజు మనం ఎంత స్థాయిలో ఉండడానికి మార్గదర్శకులు, పూలే సావిత్రి బాయి గారు. కాబట్టి ఇలాంటి మహనీయురాలు యొక్క ఆశయాలను చేపట్టి మనమందరం ముందుకు వెళ్లాలని, సేవ చేయాలని కోరుకుంటున్నాను.
                     

కామెంట్‌లు