" బసవన్న ": - - యామిజాల జగదీశ్
 నందిదుర్గం కొండ కర్ణాటకలోని చిక్బెల్లా పూర్ జిల్లాలో బెంగళూరు నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. 
4,851 అడుగుల ఎత్తైన ఈ పర్వతం తరగని నీటి ప్రవాహం కలిగి ఉండటం వలన దీనిని శివగంగ కొండ అని కూడా పిలుస్తారు.
నందిదుర్గం కొండ యొక్క మరొక అందం పర్వతం పైభాగంలో ఉన్న నంది విగ్రహం. 6 అడుగుల ఎత్తు, 10 అడుగుల పొడవు ఉన్న ఈ నంది విగ్రహం పర్వతం నుండి చూడటానికి ఒక గంభీరమైన దృశ్యం. 
స్థానికంగా, ఈ నందిని "నెల్లికాయ్ బసవన్న" అని పిలుస్తారు. నందిదుర్గం కొండకు సంరక్షక దేవత అయిన బసవన్నకు ప్రత్యేక రోజులలో నెయ్యి నైవేద్యం పెడతారు. 
విజయనగర సామ్రాజ్య పాలనలో కెంపే గౌడ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రపుటలు  చెబుతున్నాయి.

కామెంట్‌లు