తిరుపతిలో జానపద కవితోత్సవo


 తెలుగు భాష ఖ్యాతి సాహిత్య జిజ్ఞాసను  పెంచుతూ సమాజములో సంప్రదాయాలను నిత్యము ఇనుమడింపచేసేలా   నెల నెల పలుమార్లు సాహితీ విజయోస్తవ సంబరాలను తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య నిరంతర ప్రభంజనము సృష్టిస్తూ డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి ప్రముఖ రచయిత్రి జాతీయ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో  తిరుపతిలోని అంబేద్కర్ భవన్ ప్రకాశం రోడ్  నందు ఫిబ్రవరి ఒక్కటవ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు. మరుగున పడుతున్న జానపద కళలను కళాకారులను గుర్తిస్తూ జానపద గీతాలను ఆలపించనున్నట్టుగా పోగ్రామ్ నిర్వాహకురాలు డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు సాహిత్య ప్రియులు పాల్గొని కార్యక్రమoను విజయవంతవము చేయాలని డా . యు వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ పిలుపును ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా పీజీ మరియు డిగ్రీ కాలేజీ తెలుగు విభాగ అధిపతి డా .వి.కృష్ణవేణి అంబేద్కర్ భవన్ చైర్మన్ పరమశివన్   ఎక్స ఆర్మీ మేనేజర్ పూతలపట్టు మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ వాగీశ్వరి తెలుగు సేవా పురస్కారం సర్టిఫికేట్టును అందజేయనున్నారని నిర్వాహకులు తెలియజేశారు.
కామెంట్‌లు