అరుణోదయ సాహితీ వేదిక, అనుబంధ సంస్థల 4️⃣0️⃣వ అంతర్జాల కవిగాయక సమ్మేళనం

   అరుణోదయ సాహితీ అనుబంధ సంస్థలు  ,   అరుణాక్షర కవితా తోరణాలు, అరుణరాగాలు, కథాసాగరం  ,అంతర్జాలంగా జరిగిన  కవిగాయక  సమ్మేళనం గురువారం దిగ్విజయం  గా ముగిసింది.
ప్రధాన  వక్త  డా. ఆచార్య ఫణీoద్ర  గారు ( అవధాన పండితుడు, ఉదయవాణి సంస్థ అధ్యక్షులు ) 
ప్రధాన వక్త గా  పాల్గొన్నఈ సమావేశం లో, ఆచార్య డా. గౌరీశంకర్ గారు (  విశ్వ విద్యాలయ పూర్వ రిజిస్టార్ ,సలహాదారులు )
డా. జయరాములు గారు,ఆచార్యులు, ఆధ్యాత్మిక వేత్త, ) డా నాళేశ్వరం  శంకరం గారు ప్రొఫెసర్, ప్రముఖ సాహిత్య వేత్త, ఘంటా మనోహర్ రెడ్డి  గారు ప్రముఖ సాహిత్య వేత్త, కృష్ణారెడ్డి గారు ప్రముఖ  సాహిత్యవేత్త, పౌరాణిక  రచనా, గాయకుడు, డా రంగరాజు పద్మజ గారు ప్రముఖ సాహితీ  వేత్త, విశవిద్యాలయ సలహాదారిని 
పాల్గొని  కవిత్వo, కవిత్వరచనా విధానం ,సాహిత్య విషయాలపై  అనేక  విషయాలు కవులకు  ముఖ్యంగాకొత్తగా రాసే కవులకు  వివరిoచారు. అనేక  విషయాలు  తెలియ  చేసారు. 
తెలుగుబాష ఔచిత్యం, ప్రాముఖ్యత తెలియచేసారు.
దాదాపు మూడు గంటల పాటు  సాగిన  ఈ కవిగాయక సమ్మేళనంలో  అనేక మంది కవులు, గాయకులు పాల్గొని కవితలు, చక్కని పాటలు పాడి సభికులను ఆనంద పరచారు 
ముందుగా  డా.అరుణ అరుణో దయం సాహితీ వేదిక వ్యవస్థాపకురాలుప్రార్థనాగీతం  గీతం పాడి తొలి పలుకులు పలికి  అతిథు లను సాదరంగా వేదిక మీదకు  స్వాగతించారు.
సభలో  అతిథులను  అందరిని పేరు పేరునా పరిచయంచేస్తూ తమ దైన వాక్చాతుర్యం తో  అందరిని  అలరిస్తూ  కవిసమ్మేళనం  నిర్వహించారు. ప్రముఖ కవి, గురుకుల అధ్యాపకులు C. నారాయణ స్వామి గారు.
కవిసమ్మేళనంలో  చీదెళ్లసీతలక్ష్మి, అయ్యాలసోమయాజులు, వనజా బలుసాని, j. P ప్రకాష్, వనం మంజుల, డా. U లక్ష్మి, సీతాలక్ష్మి,
వివేకవతి, V. మంజుల, సంధ్య, చంద్రమౌళి, డా.దీపక్ న్యాతి, ఓగి రాల గాయత్రి, కృష్ణ, నుదురు పాటి సీతాపతి, పద్మారెడ్డి గార్లు తదితర వారు పాల్గొన్నారు. 
పాల్గొని  కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు  అధ్యక్షురాలు డా. అరుణ కోదాటి అందరికీ  ధన్యవాదాలు  తెలిపారు.
కామెంట్‌లు