కవులు కవితాంశలకైవెంపర్లాడనవసరమేముంది?!ఏసీ గదుల్లో చల్లగాలుల్లోకడుపులో చల్ల కదలని జీవుల గూర్చివ్రాయమన్నానేను వ్రాయనువారు పరాన్నజీవులుధనికస్వాములను ట్యాగ్ లైన్ తగిలించుకున్నమహాత్ములుమహనీయులుమాయల మరాఠీలుతెల్లారుఝామున్నేనిద్రలేచిరాత్రి తినగా మిగిలిన అన్నం సద్ధిమూటగట్టుకొనిచౌరస్తాలో పనికోసం ఎదురుచూసే కూలీనిజజీవితాన్ని కవితగా వ్రాస్తాదరిదాపు 10గంటలపాటుకంటిపై రెప్పవాల్చకషాపింగ్ మాల్ ముందు నిల్చొనికాపలా కాస్తున్నవాచ్మెన్ల బ్రతుకు వ్యథను కవిత్వీకరిస్తాఫ్రీ టిక్కెట్ పుణ్యమా అనిప్రొద్ధంతా అడ్డమీది ఆటో బెట్టిన ఒక్క సవారిదొరకక బ్రతికే దెట్లరా దేవుడా అంటూకన్నీరుపెట్టే డ్రైవర్ అన్నల బ్రతుకు చిత్రాన్ని కవితగావ్రాస్తాఎన్నికల వేళ ప్రచారసభలకుపనిపాటల్లేక పదుల కిలోమీటర్లుపోయిజెండాలు మోసి, జేజేలు పలికేప్రేక్షకకూలీల పనిలేనితనాన్నిరాజకీయ నాయకుల డంభాచారాన్నీ ,ఉచిత హామీల డొల్లతనాన్ని తేటతెల్లంచేయటానికి నేనో ఘాటైన కవితవ్రాస్తాఎన్నని చెప్పనుసంఘంలో ఆధిపత్యందోపిడికూడబళ్ళుకొనిబడుగు బలహీనులను ప్రమాదపు అంచుకు తోస్తుంటేఇక నేను మౌనంగా ఎలా ఉండగలనుపదునైన కవితాస్త్రాలు సంధిస్తాకవులంటేప్రజలెన్నుకొనని ప్రజాప్రతినిధులు అని నిరూపిస్తా
కవితా వస్తువులు: - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి