క్షీరమే కాలకూటమై కాటేస్తే:- కవిమిత్ర ,సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)విశాఖపట్నం
ప్రభాతసమయాన లేచి
పనులు చేసుకునే ముందు
పండ్లు తోముకున్న వెంటనే
పాలతో కూడిన వేడి కాఫీ టీలు త్రాగందే
ఉండలేని  నేటిసమాజం.
పసిపిల్లలకు తల్లిపాలు పోయి పోతపాలు పట్టడం
పెరుగు, మజ్జిగ లేనిదే పూట గడవలేని స్థితి
తెల్లవారుజామున లేచి పాలవాడి గురించి ఎదురుచూపులు
ప్రతిరోజు సమయానికి పాలందిస్తున్న
పాలవాడు  అనధికారికంగా నడిపే పాల డైరీలో పాలను చల్లబరచే కూలెంట్
పాడయి వెల్డింగ్ చేయించినా
బాగుపడక పోయినా
ప్రజలేకదా  అని స్వార్ధంతో
కలుషితమైన పాలనే అందిస్తు
కిడ్నీలు పాడయి ప్రాణాలు పోవడం,అనారోగ్యానికి కారణమవడం
అనేక కుటుంబాల కడుపుకోతకు కారణమవడానికి కారణమైంది.
పోయిన ప్రాణాలు ఎన్నికోట్లు ఇస్తే వస్తాయి
క్షీరమే కాలకూట విషమై కాటేసిందా?
దీనికి బాధ్యులు ఎవరు
విజ్ఞులు ప్రాజ్ఞులు ఒక్కసారి ఆలోచించండి!


( ఆంధ్రప్రదేశ్  లోని రాజమండ్రి లో పాలు కలుషితమై కిడ్నీలు విఫలమై కొందరి మరణానికి ,అనారోగ్యానికి కారణమైన సంఘటన విని ఆర్ద్రతతో వ్రాసినది)
............................

కామెంట్‌లు