గురువవసరమే!: - - యామిజాల జగదీశ్
 ఒకరోజు ఓ భక్తుడు భగవాన్ రమణ మహర్షిని దర్శించుకుని "స్వామీ,
గురువు అవసరం లేదని మీరు చెప్పారని కొందరంటున్నారు...
మరికొందరేమో ఇందుకు భిన్నంగా చెప్తున్నారు.‌ ఇంతకూ మీరేమంటారు?" అని అడిగాడు.
అంతట రమణులవారు "గురువు అవసరం లేదని నేనెప్పుడూ చెప్పలేదు...ఇదంతా మీరు గురువు అంటే అర్థం చేసుకునే దానిపై ఆధారపడి ఉంటుంది...గురువు మానవ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు...దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు...
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు...గురువు ఖచ్చితంగా అవసరం...గురువు మాత్రమే జ్ఞాన వనాల నుండి పంచేంద్రియాల నుండి మనలను రక్షించగలడని ఉపనిషత్తులు చెబుతున్నాయి... కాబట్టి, గురువు ఖచ్చితంగా అవసరం..." అని అన్నారు.

కామెంట్‌లు