అరవై సంవత్సరాల క్రితంఅనకాపల్లి ఆమంచి వారివీధిలోఅమ్మలక్కతో కలసి అట్లతద్ది నాడుఅన్నపూర్ణ ఇంటికెళ్ళిఉయ్యాల ఊగడంపాఠశాల మాని ఆనంతుగాడితోటూరింగ్ టాకీస్ లోజగదేకవీరుడు సినిమా కెళ్ళడంఆచారి మాస్టారుకి తెలిసి నడ్డిమీద వాయించడంబాల్యపు జ్ఞాపకాలు.ఇంటర్ లో జిల్లాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడినైజిల్లా కలక్టర్ చే సత్కరించబడటంఆనాడు నాన్న 'పుత్రోత్సాహం తండ్రికి' అనిసుమతీ శతకపద్యం చెప్పి ఆప్యాయంగా కౌగలించుకోవడంమరువలేని మధుర జ్ఞాపకమేనాకు అన్నివిధాల తోడునీడగాకష్ట సుఖాలలో కలిమిలేములలోనేనున్నాని నాకు భరోసా ఇచ్చిఅన్నీతానై పిల్లల బాధ్యతలు నెరవేర్చినఏబది ఏండ్లు కాపురం చేసిన ధర్మపత్ని మధుర జ్ఞాపకాలు.మీరు చదువుతో బాటు చెప్పిన నైతికవిలువలేమా ఉన్నతికి కారణమన్న విద్యార్థులుఎన్నని ఏమని చెప్పనుఏడు పదులు దాటిన వయస్సులోఆ మధుర స్మృతులే నా జీవిత సాఫల్యతకు సోపానాలు..!!.. .......................
మరపురాని మధుర స్మృతులు:- కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి