పుణ్యభూమి నా దేశం: - కవి మిత్ర, సాహిత్య రత్న,-అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖ పట్నం
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
అని మహాకవి చెప్పినట్లు
దేశం నాకెమిచ్చిందని అనక  దేశంకోసం ఏమిచేస్తున్నాని
 భావించిన వినోభావే, జాతిపిత మహాత్మాగాంధీ ,సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, విప్లవం వర్ధిల్లాలి 
భారతమాతా కి జై అంటూ
ప్రాణాలర్పించిన భగత్ సింగ్, అల్లూరి ల అడుగుజాడల్లో  నడచి
స్వరాజ్యమే నా జన్మహక్కు అన్న తిలక్ మహాశయుని
వారసులుగా దేశంకోసమే
జీవితం అని ఆచరించి
వసుదైవ కుటుంబానికి
భారతదేశ ఔన్నత్యాన్ని చాటుదాం. సమాజాహితమే 
అభివృద్ధికి కారణం అని నిరూపించి అందరికి ఆదర్శమవుదాం......!!
.........................
 భారతమాతా కి జై 
.............................

..................................

కామెంట్‌లు