​తాండూరులో ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు: వెంకట్ , మొలక ప్రతినిధి
 సాహిత్య లోకానికి మొల్ల ఆదర్శం : 

 మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి 
 వికారాబాద్ జిల్లా: కవయిత్రి మొల్ల కళావేదిక బాలల మాస పత్రిక “మొలక” సంయుక్తంగా   వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు - 2026 అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కవయిత్రి మొల్ల కళావేదికపై జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కవులు, రచయితలు మరియు సామాజిక వేత్తలు పాల్గొని మొల్ల రామాయణకర్త మొల్ల స్మరించుకున్నారు.
​ఆమె చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాండూర్ మున్సిపల్  
 చైర్ పర్సన్  నీరజ బాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ , తెలుగు సాహిత్యంలో మొల్ల ధ్రువతారగా నిలిచారని, ఆమె స్పూర్తితో నేటి తరం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో చక్కని సంస్కృతి అలవరుస్తుందని వేదిక చేస్తున్న కృషిని అభినందించారు ​ ప్రముఖ కవయిత్రి  ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి గారిని ముఖ్య  అవార్డు గ్రహీతగా ఘనంగా సత్కరించారు. ఆమె ప్రసంగిస్తూ మొల్ల సాహిత్య పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు   సిరిపురం చెందిన ప్రముఖ రచయిత్రి  వాసర చెట్ల జయంతి  కూడా  మొల్ల అవార్డు ఇచ్చి  సన్మానించారు 
​ఈ ​కార్యక్రమంలో  అభినయ మొల్ల  చిన్నారి వేషధారణతో అందరినీ అలరించింది 
 రఘుకుల చిలక అనే సాంగ్తో విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు 
 ఈ కార్యక్రమంలో కవయిత్రి మల్ల కళావేదిక పాండుర అధ్యక్షులు కేవీఎం వెంకట్ గౌరవ అధ్యక్షులు సత్యం
 గాజుల  బావరాజ్  శ్రీనివాస్ చారి ​బాలకృష్ణ MPT  శంకరమ్మ దంపతులు,గోవింద్  రావు,ప్రకాష్,  ఆనందం
 సురేష్ ప్రభుతాండూరు పట్టణంలోని 18 పాఠశాలమల్లా సాయి తంపై వ్యాసరచనలో గెలుపొందిన 60 మంది
 మెమొంటో సర్టిఫికెట్ తో బహుమతులు ప్రధానం చేశారు
​మొలక పత్రిక సంపాదకులు ,  నిర్వాహకులు సాహిత్యకారులను గౌరవించుకోవడం తమ అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కవులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు