ఏబది ఏండ్ల సాహితీ మిత్రులతో:- కవిమిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి) -విశాఖపట్నం
 విశాఖలోని పౌరగ్రంధాలయంలో
సహృదయ సాహితి నాలుగు దశాబ్దాల  వార్షికోత్సవం జరుగుతుందని
అధ్యక్షులు శేఖరమంత్రి వారు మీరు తప్పక రావాలని
ఆహ్వానం పంపితే
తప్పకుండా వస్తాను గురువులు  ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
మా విశ్వవిద్యాలయ పూర్వకులపతి ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు
ఎప్పుడు బాగున్నావ అనే హితుడు, స్నేహితుడు సన్నిహితుడు
సాహితీవేత్త రచయిత వేదుల శిరీష కలసి
ఆనాడు వ్రాసినవి ముద్రించుకోవడం
విషయాలు తెలుసుకోవడం ప్రసారమాధ్యమాలు లేనిరోజులు ఎంత శ్రమయో అని
నేడో సాంకేతిక పరిజ్ఞానం 
అరచేతిలో ఉన్న చరవాణితో
అన్ని విషయాలు లభ్యమని
కాలంతో బాటుమనం మారాలి అని
డెబ్బది నుంచి ఎనుబది సంవత్సరాల వయస్సులోఉన్న మేమంతా
అనుకుని
ఒక్కసారి మనుమడిచ్చిన సెల్ఫీ తో ఫోటో తీస్తా అని తీసి చూపిస్తే
కాదేది వయసుకనర్హం అన్నారు నా పక్కనే ఆశీనులైన
గురువులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు
మీ లాంటి గురువుల దగ్గర చదివిన మాకు వయస్సుతో పనిలేదని
ఆశీర్వాదం తీసుకున్నాను...!!
.........  ..................
.............................

కామెంట్‌లు