తెలుగు సాహితీవనం ఆధ్వర్యంలో నిర్వహించిన "MLS స్నిగ్ధా రెడ్డి బాలసాహిత్య పురస్కారం-2026" ఫలితాలు: - శాంతి కృష్ణ,
 ఈ బాలసాహిత్య పురస్కారంకు  వివిధ ప్రాంతాల నుండి కథా, గేయ కవిత, నవలలు కలిపి మొత్తం 95 పుస్తకాలు వచ్చాయి.
రెండు విడతల పరిశీలన తరువాత, 16 పుస్తకాలు న్యాయ నిర్ణేత "టి.వేదాంతసూరి“ గారు పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. 
”వడ్డేపల్లి వెంకటేష్“ గారి కథల సంపుటి "పిల్లల జాబిల్లి" 5వేల నగదు పురస్కారానికి ఎంపిక అయింది. 
10వ తరగతి విద్యార్థి “ఆవుల పోతురాజు” కథల సంపుటి "నాన్నే నా హీరో“ కి ప్రోత్సాహక బహుమతిని ప్రకటిస్తున్నాము. 
తెలుగు సాహితీవనం 9వ వార్షికోత్సవం జూలై లో  హైదరాబాద్ లో జరుగుతుంది.  సభకు వచ్చి పురస్కార, ప్రోత్సాహక అభినందనలను  అందుకోవలసినదిగా విజేతలను కోరుతున్నాము. 
శాంతి కృష్ణ, 
తెలుగు సాహితీవనం వ్యవస్థాపక అధ్యక్షులు.

కామెంట్‌లు