సమాజం అధర్మభూయిష్టంగా ఉన్న స్థితిలోధర్మపరిరక్షణార్ధం దివి నుంచి భువికి ఏతెంచిఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించిసనాతనధర్మ ఔన్నత్యాన్ని చాటిన ఆది శంకరులు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులే.దైవం కన్న జన్మకు కారణమైన మాతృమూర్తి మిన్నయనిఆమె ఆశీస్సులతో సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిసమాజన మూఢనమ్మకాలకు వ్యతిరేకించిపరదేవతా స్వరూపమైన తల్లి దహన సంస్కారాలు చేసిన మహనీయులుఎంతకాలం బ్రతికేమన్నది గాకజీవించినంతకాలం ధర్మయుతంగా ఉన్నామన్నదానికిశంకరాచార్య వ్రాసిన గ్రంధాలువివేకాచూడామణి,బ్రహ్మసూత్ర భాష్యం,ముండకోపనిషత్తుసాధనా పంచకము నిర్వాణ శతకము మనీషా పంచకముఎన్నో ఎన్నెన్నో వేద ఉపనిషత్తుల భాష్యాలురచించికనకధారాస్తోత్రం తో పేద బ్రాహ్మణ స్త్రీ దారిద్ర్యం పోగొట్టినధర్మపరిరక్షణకై దేశపర్యాటనచేసినశంకరులు ముప్పది మూడేండ్లు జీవించినాసనాతన ధర్మ పరిరక్షకుడుసాక్షాత్తు దివి నుండి భువికి దిగివచ్చిన పరమేశ్వర ప్రతిరూపమేఅందుకే మీరు సదా స్మరణీయులే.వైశాఖ శుక్ల పంచమి మీ జయంతి రోజునమీకివే నే నందిస్తున్న అక్షరకుసుమాలు...!!............................
ఆది శంకరులు సాక్షాత్తు పరమేశ్వరులే: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి