సుచక్షువు, సీత, సింధు మూడు మహానదులు
పశ్చిమ దిశగా ప్రవహించినవి
ఆ గంగా ప్రవాహంలో భగీరథ ఏడవది
అది భగీరథుని రథము వెంట ప్రవహిస్తుంది
ఆ గంగ నీటిలో చేపలు తాబేల్లు వచ్చినాయి
దివి నుండి భూవికి చేరిన ఆ గంగను
దేవతలు, ఋషులు, గంధర్వులు
సిద్ధులు మొదలగువారు పూజలు చేశారు
ఆ పవిత్ర గంగాలో జనులు స్నానం చేసి
అలసటలు తొలిగి సంతోషించుచున్నారు
రథం పై భగీరథుడు ముందుకు సాగిపోగా
గంగానది అతడిని అనుసరించు వెళ్లినది
జాహ్నవి మహర్షి క్రతువును ఆచరించుచుండగా
గంగా ఆ యజ్ఞవాటికను ముంచి వేసెను
ఆ మహర్షి మిక్కిలి కోపముతో
ఆశ్చర్యముగా మాయము గావించినాడు
దేవతలు చూసి అతడిని పూజించినారు
గంగాదేవిని అ మహార్షికి కుమార్తెగా జేసినారు
అప్పటినుండి జాహ్నవి గంగగా ప్రసిద్ధిగాంచినది
ఆ గంగా పాతాళంలోనికి ప్రవహించి
భస్మరాసులను ముంచి వేసి నాది
సగర పుత్రులు స్వర్గము చేరినారు.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి