సీతారామలక్ష్మణులు యమునానదిని దాటుట
-------------------------
భరద్వాజాశ్రయమున ఆ రాత్రి గడిపి
మరునాడు ఆ మహర్షికి నమస్కరించి
ఆయన అనుమతితో బయలుదేరినారు
ఆ మహర్షి వారితో కొంత దూరమునడిచి
వెళ్లవలసిన మార్గములను గూర్చియు
తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపును
అతని మాటలను జాగ్రత్తగా విన్నారు
"ఓ నర శ్రేష్టులారా! గంగాయమునాసంగమ
ప్రదేశమును మీరు చేరినాక
పశ్చిమాభిముఖులై యమునానది తీరమును
అనుసరించి ప్రయాణము చేయుడు.
ఓ శ్రీరామా! యమునానది తీరమున
జనులు నడిచే ప్రాచీనరేవును జూచి
వారి అడుగుజాడలను బట్టి
ఆరేవును గుర్తించి తెప్పపైప్రయాణించుడు
ఆవలి తీరమున శ్యామము అను మర్రిచెట్టు కలదు
ఆ వృక్ష ఛాయలో సిద్ధులు నివసించెదరు
సీతాదేవి ఆ వృక్షమునకు నమస్కరించి
శుభాశీస్సులను పొందవలెను

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి