ఓ లక్ష్మణా! మనపై ఆ మహర్షి కృప జూపెను
సీతారామలక్ష్మణులు నదితీరమునకు చేరిరి
ఈ నాదిని దాటుట యెట్లా? అని ఆలోచించి
రామలక్ష్మణులు ఎండిన వెదురుకర్రలను తెచ్చి
ఒక పెద్ద తెప్పను సిద్ధము చేసినారు
లక్ష్మణుడు సీతాదేవి కొరకై
చక్కని ఆసనమును ఏర్పాటు చేసినాడు
ఆ తెప్పను ఎక్కి వారు నదితీరమును దాటినారు
మర్రి చెట్టు వద్దకు వారు చేరినారు
సీతాదేవి ఆ వృక్షమును ప్రార్థించి
రామలక్ష్మణులతో కలిసి ముందుకు నడిచినది
వారు సుందర ప్రదేశమున విహరించి
అనంతరము యమునా నది తీరమున
ఒక సమతల ప్రదేశమునకు చేరి
సీతారామ లక్ష్మణులు అచట నివసించిరి.
===================================
అయోధ్యకాండమునందు 55వ సర్గ సమాప్తము 🙏🏻

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి