66వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
మహారాజు మృతికి మిక్కిలి దుఃఖితురాలైన కౌసల్యా దేవి 




అసువులు వీడిన ఆ మహారాజు 
ఆరిపోయిన అగ్నివలెను నీరింకిన సముద్రము వలె
నిర్జీవుడైన తన పతిని జాచి కౌసల్యాదేవి 
పరిపరివిధముల శోకించుచుండెను 

ఓ కౄరురాలా! దుర్మార్గురాల! ఓ పాపి! 
నీ మనసులోని కోరికలు తీరెను గదా!
మహారాజును వదిలించుకుంటివి 
ఇక నీకు అడ్డు చెప్పేడి వారే లేరు 

మహారాజు మరణించి యున్నాడు
ఇచ్చట నేను అనాధనైయుంటిని 
ధర్మాత్ముడైన శ్రీరాముడు దూరాన యుండెను 
ఈ విషయములను అతడు ఎరగడు 

పవిత్రమైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో 
నేడే సహగమనము చేసెదను 
ఆయన దేహంతో పాటు నా తనువును గూడా 
చితాగ్నికి ఆహుతి గావించెదను. 

పతి పార్తీవదేహము వద్దా కౌసల్యాదేవి 
సీతారామ లక్ష్మణులను దలచుకొని
విలపించుచున్న కౌసల్యాదేవిని 
పరిచారికులు దూరముగా తీసుకువెళ్లిరి 

కామెంట్‌లు