70వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
దూతలు వసిష్టుని ఆదేశమును భరతునికి తెలుపుట 




అయోధ్య నుండి వచ్చిన ఆ దూతలు 
రమ్యమైన నగరమున ప్రవేశించిరి
తమ కడకు వచ్చిన దూతలను కేకయరాజు
తన కుమారుడైన యధాజిత్తు 
ఆధరసత్కారములతో గౌరవించిరి 

ఆ దూతలు అయోధ్యకు రాజు కానున్న 
భరతుని పాదములకు నమస్కరించి 
"నాయనా! ఓ భరతా!
మా మాటలను వినుము 
వంశ పురోహితుడైన వసిష్ఠ మహర్షి ,మంత్రులందరు

మీ క్షేమాచారముల గూర్చి ప్రస్తావించరి 
అయోధ్యలో మీరు అత్యవసరముగా 
నిర్వహించవలసిన కార్యము గలదు 
కనుక మీరు వెంటనే మాతో బయలుదేరుడు 

ఓ రాజకుమారా! అమూల్యములైన 
ఈ వస్త్రాభరణములను స్వీకరింపుడు
వీటిని మీ తాత గారికి సమర్పింపుడు 
భరతుడు ఆ కానుకలను స్వీకరించెను

వాటిని మహారాజునకు మేనమామకు అర్పించి
భోజనములతో దూతలను సంతృప్తిపరిచెను 
మా తండ్రి దశరథమహారాజు కుశలమేనా?
మహాత్ములైన రామలక్ష్మణులు కుశలమేనా?

కామెంట్‌లు