భరతా! రాజ్య సింహాసనమున పట్టాభిషిక్తుడవుకమ్మ ని కైకేయి తెలుపుట: ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


మీ తండ్రి సత్య ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుటకై
శ్రీరాముని అడవులకు పంపెను 
అతని వెంట సీతా లక్ష్మణులు గూడా వెళ్ళినారు 

మిక్కిలి ఖ్యాతిగాంచిన ఆ మహారాజు 
ప్రియపుత్రుడైన శ్రీరాముడు దూరమగుట వలన 
పుత్రశోకముతో మిక్కిలి దుఃఖించెను 
అతని ఎడబాటు తట్టుకోలేక స్వర్గస్తుడాయెను 

రాజనీతిజ్ఞుడవైన ఓ భరతా! నీ కొరకై 
ఈ కార్యమును నేను నిర్వహించితిని
నీవు మహారాజ పదవిని చేపట్టుము 
నీ తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను 

ఓ పుత్రా! నీవు శోకతాపములను వీడుము 
నీలో ధైర్యమును వహింపుము 
ఈ కోసల రాజ్యమునకు నీవే రాజువు 
నాయనా! భరతా! నా మాటలను వినుము 

అన్ని తెలిసిన వసిష్ట మహర్షి తో బ్రాహ్మణులతో గూడి
సాటిలేని పరాక్రమశాలియైన మీ తండ్రి 
అంత్యసంస్కారములను చేయుము 
వెంటనే కోసలరాజ్యసింహాసనమున పట్టాభిసిక్తుడవుకమ్ము."
=====================================
అయోధ్యకాండ నందు 72వ సర్గ సమాప్తము🙏🏻
కామెంట్‌లు