"అదృస్యవీరుడు" జానపద నవల 5️⃣✅వ బాగం: నాగమణి రావులపాటి

 

చేసేది లేక నలుగురితో నారాయణ అని
 మనసులో అనుకుని మహారాజు వద్ద శలవు తీసుకుని,
స్వయంవరం ఏర్పాట్లు ఘనంగా జరిపించటం కోసం
తగిన సూచనలు ఇవ్వ వలసిన వారికి ఇస్తూ, 
యువరాణీ వారికి గట్టి బందోబస్తు బద్రతా ఏర్పాట్లు  
చేయించి, స్వయం వరానికి విచ్చేసే వారికి తగిన 
విడిది ఏర్పాట్లుచేయించాడు సుభుద్ది ...!!!

విడిది వాకిళ్ళతో ఆసౌరాష్ట నగరం శోభాయమానంగా మారిపోయింది...
ఎక్కడెక్కడినుంచో యువరాజులు స్వయంవరాన్ని తిలకించి
అమృతవల్లిని స్వంతం చేసుకోవాలనే ఆతురతతో,
సాద్యమైనంత వరకు అన్ని విద్యలలో ఆరితేరినవారై,
 అందంగా ముస్తాబై అంగరంగ వైభవంగా వేంచేసే 
రాకుమారుల కోలాహలం చెప్పతరం కాదు.
చూడటానికి  రెండు కళ్ళూ చాలటంలేదు...!!!

ఇక యువరాణి అమృతవల్లి గురించి చెప్పేది ఏమి
వున్నది.సహజ సౌందర్యరాసి. అనన్య గుణ సంపన్ను
రాలు. సకల విద్యా పారంగతురాలు .ఆమె కోసం
మహారాజు ఏర్పాటు చేయించిన ఉద్యానవనం
ఒక నందన వనాన్ని తలపిస్తుంది...!!!

ఎంతో విస్తీర్ణంతో భూలోకంలో లభించే వివిద రకాల పూల సంపదతో, అందమైన లతా పల్లవాలతో, తటాకాలతో, ఎంతో సౌంధర్యవంతమైన
అద్దాలమేడలతో, పూల లతలతో నిర్మితమైన 
అందమైన ఊయలలతో, చుట్టూ నిలువెత్తు
 ప్రాకారాలతో, ఆ గోడలపై చేయివేస్తే గుచ్చుకునే
గాజు పెంకుల అమరికలతో, ప్రాకారానికి బయట
చుట్టూ నిలువెత్తు కందకాలతో, చూసేవారికి నేలనే
అనుకునేవిదంగా అడుగు వేస్తే ఆగోతిలో పడాల్సిందే...!!!

ఆ విధమైన ఏర్పాట్ల మద్య యువరాణీ అమృతవల్లి
తన చెలికత్తెలతో నిర్బయంగా విహరించే రీతిలో
వుండే ఆ అందమైన వుద్యాన వనానికి ఇంకా తగిన
రక్షణ కలగజేసాడు మంత్రి సుబుద్ది...!!!

 ఈవిధంగా యువరాణీ అమృతవల్లి హాయిగా ఆడుతూ
పాడుతూఎన్నో ఆశలు మదిలో నిండగా వివిధ
దేశాల యువరాజుల చిత్రపటాలను సేకరించి
ముందుంచగా వారిని తిలకిస్తూ, ఆ చిత్రాలలో వున్న
యూవరాజులందరూ విచ్చేసి విడిది గృహాలలో
వేంచేశారని తెలిసి సిగ్గుల మొగ్గై, స్వయంవరానికి
పూర్తీ సహకారంతో తయారయింది యువరాణి 
అమృతవల్లి...!!!
**********
ఇదిలా వుండగా ఆ సౌరాష్ట్రదేశంలో గుణసేనుడు అనే సాదారణ రైతు వుండేవాడు. అతనికి వున్న 
కొద్దిపాటి పొలంలో సేద్యం చేసుకుంటూ వున్దదాంట్లో సంతృప్తికరంగా జీవిస్తున్నాడు.అతనికి జయసేనుడు
అనే అందమైన కుమారుడు వున్నాడు...!!!

 అందంలో గుణంలో ఎంతో ఉన్నతమైన వాడు.
 చిన్నప్పటి నుండి ఆదర్శ బావాలు కలిగినవాడై
 సైన్యంలో చేరి రాజ్యానికి సేవచేయాలని ఎంతో
అకాంక్ష కలిగిన వాడైనందున అతని తండ్రి
 గుణసేనుడు, జయసేనుడికి సకల కళలతో తీర్చి
దిద్దాడు. పెరిగి పెద్దవాడై ఒక మంచి వీరుడిగా లోకు
లలో ఎంతో గణ్యత పొందాడు...!!!

 అందరికీ సాయపడే మంచి గుణం కలిగిన వాడై 
అలరారే వీరుడైన జయసేనుడికి ఓ అందమైన తెల్లని
అశ్వం వుంది.దానిపేరు కళ్యాణి. జయసేనుడికి 
నమ్మిన బంటు. ఇద్దరూ మంచి స్నేహితులు.
 కనుసైగతో ఎక్కడికైనా ఆగ మేఘాలమీద 
తీసుకెళ్ళే సమర్దవంతురాలు.ఆ దేశ యువరాణి
 వారికి స్వయంవరం ప్రకటించగానే తిలకించాలనే
ఆసక్తితో రాచనగరానికి బయలు దేరాడు
జయసేనుడు...
 (సశేషం) తరువాత బాగం రేపే...
కామెంట్‌లు