ఆచార్య దేవో భవ (2):- -బెహరా ఉమామహేశ్వరరావు.సెల్ నెంబర్: 9290061336

 గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః/
గురుర్విశ్వం నచోన్యాస్థి తస్మైశ్రీ గురువే నమః//
శ్లోక భావం:-గురు మధ్య విశ్వమంతా ఉన్నది. విశ్వము మధ్యలో గురువు నివసించే యున్నాడు
గురువు, విశ్వమునకు  మించి మరొకటి యీ జగతి యందున  ఏదీ లేదు.
పవిత్ర రామాయణ గ్రంథంలో మరో గురువు  బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. రామునికి పదిహేనేళ్ల వయసులోనే యాగ  సంరక్షణ పేరుతో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దశరధుని అనుమతితో అడవి లోగల ముని ఆశ్రమాలకు తీసుకొని వెళ్ళాడు. మార్గమధ్య కనిపించే ప్రదేశాలను చూపిస్తూ సంచార విద్యా పద్ధతి ద్వారా బోధించాడు.దేశాన్ని పరిపాలించబోయే రాజు; దేశం నలుమూలల ఎక్కడ ఏముందో తెలుసుకోవాలి. అది మంచి పరిపాలనకు ఎంతో తోడ్పడుతుంది. యుద్ధ విద్యలు అభ్య సించడమే కాదు,అనుభవం లోనికి తీసుకురావాలి. గతంలో అనుభవములు గల రాజర్షి విశ్వామిత్రుడు శ్రీరామునికి అన్ని విధాలుగా గురువు అయినాడు. స్త్రీ సంహారం అధర్మ మైన తాటకి వంటి దుష్ట స్త్రీలను సంహరించుట తప్పుకాదని, అహల్య వంటి ఆర్తులను ఆదుకోవడం సాధ్యమేనను అనుభవ జ్ఞానం కలిగించాడు. తన జీవితంలో తప్పు ఒప్పులను దాచకుండా వ్యక్తిత్వ వికాసం కోసం విశ్వామిత్రుడు శ్రీరామునికి బోధించిన గురువు. భవిష్యత్తులో రాక్షస సంహారానికి అన్నీ తానై శ్రీరామునికి  బోధించిన ఆదర్శ గురువు. శ్రీరాముని మిథిలా నగరానికి తీసుకొనిపోయి సీతారాముల కళ్యాణం జరిపించిన మహా ఋషి.
     రామాయణంలో మనకు కనిపించే మరొక గురువు; సూర్య భగవానుడు ఇక్వాకు  వంశానికి మూల పురుషుడు.. ఈయన  గ్రహాధిపతి. తన కర్తవ్యం పాటిస్తునే తనతో పాటు తిప్పుకొని విద్యను బోధించే ఆదర్శ ఉపాధ్యాయుడు. పసితనంలో పండు అనుకొని తనను మింగడానికి వచ్చిన హనుమంతుడు నోరు కాల్చుకున్నాడు. అయినా  అతని కార్యదీక్షను గమనించి పలు వ్యాకరణాలు విద్యా బుద్ధులు పరిపూర్ణముగా నేర్పాడు.
ఉదయం నుండి సాయంత్రం వరకు తనతో పాటు  ఎగర గలిగే శక్తిశాలి ఆంజనేయుడు. పరిశీలనా దక్షుడు కార్యసాధకుడు, అయినా అతనికి సానబెట్టి విద్యలు నేర్పిన ఘనత సూర్యునికే చెల్లుతుంది.ఆ
శక్తితోనే హనుమంతుడు సముద్రము దాటి లంకకు వెళ్ల గలిగాడు. చిన్ననాడు గురువులు నేర్పిన విద్య భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, అనడానికి ఇదొక ఉదాహరణ.
రామాయణంలో మరొక సుప్రసిద్ధ గురువు వాల్మీకి.ఈ
మహర్షి ఆశ్రమంలో పుట్టి పెరిగిన లవకుశులకు విద్యాబుద్ధులతో పాటు శస్త్రాస్త్ర విద్యలు నేర్పాడు. సంగీతసాహిత్యాల యందు అభినివేశం కలిగించాడు. ఆయన   నేర్పిన  విద్యల ఫలి తంగా లవకుశులు అయోధ్యకు వెళ్లి తండ్రిని చూడ గలిగారు. తండ్రి విడిచి పెట్టిన అశ్వమేధ యాగ అశ్వాన్ని నిలువరించ గలిగి శ్రీ రాముని ఎదిరించిన వీర పుత్రులు. అట్టి లవకుశుల వ్యక్తిత్వం తీర్చిదిద్దిన గొప్పతనం వాల్మీకి మహర్షిదే. ఆయన ఉపాధ్యాయ లోకానికి అందించిన విద్యా ప్రణాళికల వలన ఈనాటికి ఆదర్శప్రాయుడైనాడు..
ఇక మహాభారతంలో అనేకమంది ఘనమైన గురువులు ఉన్నారు.లక్షా పాతిక వేల శ్లోకాలతో మహాభారతం అందించిన మహా గురువు వేదవ్యాస మహర్షి. భారతంలోని ఉదంకో పాఖ్యానమే గురుశిష్యుల అనుబంధానికి ఒక గొప్ప ఉదాహరణ. తరువాత కౌరవ పాండవులను వీర యోధులుగా తీర్చిదిద్దిన మహోన్నత గురువు ద్రోణాచార్యుడు.
మహాభారతంలో మరొక సుప్రసిద్ధ సన్నివేశం "కచ దేవయానుల కథ"ఈ కథలో గురువు దేవయాని తండ్రి శుక్రుడు. శిష్యుడు బృహస్పతి కొడుకు కచుడు.
శుక్రుడు, బృహస్పతుల మధ్య శత్రుత్వం ఉంది. కానీ"మృత సంజీవని" విద్య కోసం శుక్రుని వద్దకు వచ్చిన  కచుడు. ఉత్తమ విద్యార్థి పక్కదారులు పట్టకుండా తన ఆశయాన్ని ఎలా సాధించాడు. తనకు శత్రువు కొడుకైనా కచునికి శుక్రుడు విద్యలు నేర్ప డానికి రెండు కారణాలున్నాయి. అవి 1. పుత్రికా వ్యామోహం 2. మద్యపాన వ్యసనం; ఈ రెండు బల హీనతలు కవచునికి లాభదాయకం అయినాయి.
ఈ రెండు లోపాలు గురువులో ఉండకూడనివిగా గుర్తించగలం. అలాగే మహాభారతంలో మరో గురువు పరశురాముడు. ఈయన భీష్మునికి విద్యలనేర్పి మహావీరునిగా తీర్చిదిద్దాడు.
 కాశీరాజు కూతురు అంబకు భీష్ముని వలన అన్యాయం జరిగింది.ఆ విషయం ఆంబ పరశు రామునికి తెలియజేసింది. ధర్మం కోసం శిష్యుడైన భీష్మునితో యుద్ధానికి తలపడిన ఆదర్శ గురువు. అనివార్య పరిస్థితుల్లో యుద్ధము నుండి  విరమించుకోవలసి వచ్చింది.
  మరి కొంత కాలానికి కర్ణుడు అసత్యం పలికి పరశురాముని వద్ద విద్యలు నేర్చు కున్నాడు. నిజం తెలిసిన పరశురాముడు కోపగించుకుని అతనికి అవసర‌ మైనప్పుడు విద్యలు గుర్తుకు రాక పోవునని కఠినంగా శపించాడు.
భాగవతంలో కూడా గురువులు కనిపిస్తారు. బలి చక్రవర్తికి శుక్రాచార్యుడు. ప్రహ్లాదుని గురువులు చండా మార్కులు. బలరామకృష్ణులు గురువైన సాందీపుడు. ఈ ప్రసిద్ధ గురువుల చరిత్రలు ఎంత చెప్పినా   తక్కువే అవుతుంది. అందుకే యువకులు చదివి తెలుసుకోవాలి.
మనకు పురాణాలలో నారద మహర్షి, పరాశరుడు, వ్యాసమహర్షి, శుకుడు, భరద్వాజుడు ఇత్యాది ఆదర్శ గురువులు అనేకమంది ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క 
ప్రత్యేకత, చెప్పాలంటే ఒక్కొక్క అధ్యాయం అవుతుంది.(సశేషం)
       
కామెంట్‌లు
Unknown చెప్పారు…
శ్రీ గురుభ్యోన్నమః 🙏 పురాణ ఇతిహాస భరిత గురుదేవులపై స్మరణ తీపి గురుతులై పాత తరాలవారికి , నేటి తరానికి ఆదర్శ మార్గం అందించిన మీకు ధన్యవాదాలు 🙏🌺🍊
Unknown చెప్పారు…
నేను రాసిన ఈ వ్యాసాన్ని చదివి మీ అమూల్య అభిప్రాయం అభినందనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ఇదంతా మన గురువుల గొప్పతనమే గానీ నాది అంటూ ఏమీ లేదు
కృతజ్ఞతలు.
Unknown చెప్పారు…
మీరు మీరు ఈ వ్యాసాన్ని చదివి నన్ను అభినందించినందులకు ధన్యవాదాలు ఇందులో నా ప్రత్యేకత ఏమి చేయలేదు
మన గురువులక గురించి చెప్పడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
మీ పేరు సెల్ నెంబరు వివరాలు తెలియజేస్తే బాగుండేది నాకు ఈ కొత్త టెక్నిక్లు ఏమీ తెలియవు ఫోన్ ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేయగలను. కృతజ్ఞతలు
Unknown చెప్పారు…
ధన్యవాదములు సార్ ☺️
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
కవిత నా తోడు;- యలమర్తి అనూరాధ-హైదరాబాద్ -చరవాణి:924726౦206
టక్కరీ టిక్కరీ నక్క - గంగదేవు యాదయ్య
చీర కట్టుకు ఫిదా అయిపోయా!--ప రికిణీ ఓణీలో కనిపించే అమ్మాయిలంటే ఎంతిష్టమో అంతకు రెట్టింపిష్టం చీరకట్టులో ముస్తాబైన మగువను చూడాలంటే. చీర మాట స్ఫురణకు వచ్చినప్పుడల్లా ఎప్పుడో ఎక్కడో నేను రాసుకున్న కవితొకటి గుర్తుకొస్తోంటుంది.... "నువ్వు చీరలో వస్తుంటే దారిపొడవునా నిన్ను చూసిన వారందరూ శిలలై నిల్చుండిపోయారు! చీరను కట్టుకున్న సంతోషం నీ ముఖంలో చూసాను! నిన్ను కట్టుకున్న సంతోషం చీరంతటా చూసాను! ఇంకా ఎందరి హృదయాలను లేలేత దూదిపిందలల్లే మార్చబోతున్నావో కదూ నీ చీరకట్టులోని అందమైన నవ్వుతో!! చాలమ్మాయి, చాలిక, ఇక లేదు నా దగ్గర కోల్పోయేందుకు మరొక హృదయం....!! నీ చూపులు చీరందంతో పోటీ పడి జరిపే నాటకానికి కిందా మీదా అయిపోయేది నా హృదయమేగా!! అర క్షణంలో పడిపోతాను చీరకట్టులో నిన్ను చూసినప్పుడల్లా!! ఎందుకిలా అనుకుంటున్నానో తెలుసా నీకు నన్ను నేను మరచి...? నేను నాదేనని అనుకున్న మనసుని నీ చీరకట్టుతో నీ వెంటే తీసుకుపోతున్నావు అప్రమేయంగా!! అంతెందుకు ఓమారడిగావు గుర్తుందా "ఈ చీర నాకు బాగుందాని?" అప్పుడు నేనిలా అన్నాను... "బాగుండటమేంటీ, చీర కట్టులో మాత్రమే నీ అందమంతా అందిస్తున్నావు నాకు" అని! అవును, చీరకున్న శక్తి,.ఆకర్షణ అలాంటిది! శ్రీమతి జ్యోతి వలబోజు గారి ప్రేరణతో "సరదా శతకం"గా బ్నింగారు పాఠక లోకానికి అందించిన "చీర పజ్యాలు" మళ్ళీ చదివానిప్పుడు. పరికిణీ మీద కవితలు రాసిన "పరికిణీ వాలా" తణికెళ్ళ భరణిగారు "చీరని ఉతికి ఆరేయకుండా, చీరని చిరాకు పడే వాళ్ళని ఉతికి, చీరకి కుచ్చిల్లు పెట్టిన బ్నింగారికి "త్రీ ఛీర్స్" అనడం పట్టుచీరకున్నంత అందంగా ఉంది.బ్నింగారు మాటలతో మురిపిస్తారు. మరిపిస్తారు. ఓసారి ఆయనతో పరిచయమైతే మళ్ళీ మళ్ళీ ఆయన మాటలు వినడానికి మనసు ఉవ్విళ్ళూరుతుంంటుందనడం అతిశయోక్తి కాదు. తల్లావజ్ఝల లలితాప్రసాద్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్న మరుక్షణమే బ్నింగారికి ఫోన్ చేసి అడ్రస్ అడిగి వారింటికి కలియడంతో మా మధ్య పరిచయం శ్రీకారం చుట్టుకుంది. అదిప్పటికీ హాయిగా ఆనందంగా కొనసాగుతోంది."చీరపజ్యాల" రచనా శతకానికి శతక లక్షణమైన "మకుటం" లేనందువల్ల దీనిని శతకమనలేమని, కనుకే "సరదా శతకం"గా బ్నింగారు పద్యాల నడకను చదివి తరించవచ్చన్న డా. అక్కిరాజు సుందర రామకృష్ణగారి మాట అక్షరసత్యం."ఫెమినిస్టుని కాదుగానీ ఫెమిన్ ఇష్టున్ని అని చెప్పుకున్న బ్నింగారికి స్త్రీత్వం మీద విపరీతమైన ఇష్టమూ! గౌరవమూ!! చీరలంటే ఇష్టమున్న బ్నింగారు తమ ముందుకు అమ్మాయిలు మోడ్రన్ డ్రస్సులు వేసుకుని రావడానికి భయపడేలా మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తారు. తన సరదా శతకంలో కొన్ని పద్యాలు పేలాయని, కొన్ని పెట్రేగాయని చెప్పినప్పటికీ చీరందంలోని సొగసుని చాటి చెప్పడానికి బ్నింగారి శైలితో, భావంతో ఏకీభవించని వారుండరు. "బాపూ రమణల సినిమాల్ చూపెట్టును తెలుగుతనము జూమ్ షాట్లలోఆ పిక్చర్లో తరచుగ ఓ పాటనొ సీనులోనొ ఒదుగున్ చీరే!" అంటూ మొదలుపెట్టిన చీరపజ్యాల శతకాన్ని "చీరలపై శతకాన్ని వెరెవ్వరు రాయలేదు వింతే కాదా వారెవ్వా! నా బ్రైన్ లో ఊరించే చీర మడతలున్నా యింకాన్" తో ముగించారు.. ఇందులోని ప్రతి పద్యమూ చదివి ఆర్థం చేసుకోవడానికి శబ్దరత్నాకరమో శబ్దార్ద చంద్రికో లేక మరే నిఘంటువో అవసరం లేదు. అన్ని మాటలూ మన చుట్టూ మనతో మనలో ఉన్నవే. కనుక వాటిని చదువుతున్న కొద్దీ చీరకట్టుకున్న ప్రాధాన్యం విదితమవుతుంది. వారంరోజుల్లో ఈ చీర శతకాన్ని బ్నింగారు నేసిన సమయంలో రెండు సార్లు బ్నింగారిని కలిశాను. ఈ పుస్తకం ఇన్ సైడ్ కవర్లలో ఆయన వేసిన రెండు కార్టూన్లను వేస్తున్నప్పుడు ఎదుటే ఉన్నాను.వాటిలో ఒకటి - "అరుస్తారెందుకు? నా కన్నా చీరలే మీకిష్టం కదా....కులకండి! అంటూ చీరల ట్రంకుపెట్టెలో ఉన్న భర్తతో భార్య చెప్తున్నటువంటి ఈ మాటలు బలే పేలాయి. ఇక రెండో కార్టూనుకి "చీరలు కొనమని భార్యలు / ఊరకనే కోరబోరు - ఉందురు ఓర్పున్ / వారల అవసర మెరిగియు / మీరే తెచ్చివ్వ వలయు మేలగు నేస్తం" అంటూ అందించిన పద్యం మజాగా ఉంది.ప్రతి పద్యంలోనూ బ్నింగారు పలికించిన భావం "చీరకట్టులో ముచ్చటగా, ముద్దుగా కనిపించే సొగసైన కన్యలా" ఉంది.చీరలపై పుట్టిన సాహిత్యంలో, ముఖ్యంగా జానపద సాహిత్యంలో చీరందాలను ఎంతలా అభివర్ణించారో అందరికీ విదితమే."చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా" అని ఒకరంటే "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి...." అని మరొక కవి మాట. అయితే ఇంకొక కవి "జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గొచ్చింది...." అనడం ఎంత బాగుందో కదండీ. చీరంటే మాటలా! కనుక చీర పజ్యాలనొక్కసారైనా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా స్త్రీలు చదివితే బాగుంటుందని నా మాట.- యామిజాల జగదీశ్
చిత్రం
సగటు మనిషి ఆవేదన- సాహితీ సింధు, పద్య గుణవతి సరళగున్నాల