జననేత - వై.ఎస్.ఆర్ (5) - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ సిద్ధాంతాలు ఆదర్శాలు స్ఫూర్తిగా పుణికి పుచ్చుకునే వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన సతీమణి శ్రీమతి విజయలక్ష్మి శ్రీ రాజశేఖర్ రెడ్డి విజయవాడ లయోలా కాలేజీలో పియుసి చదువుకున్న రోజుల్లో  ఎంతోమంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. ఆ తరువాత తను వైద్య విద్య కోసం గుల్బర్గా వెళ్లి అక్కడ ఎంబిబిఎస్ పూర్తి చేశాడు  అక్కడ కూడా తనతో చదువుకున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూనే  అక్కడి విద్యార్థులకు నాయకుడిగా ఉండి  ఆ రోజుల్లోనే నాయకత్వ లక్షణానికి అక్కడ బీజం పడింది. వైద్య విద్య పూర్తి చేసుకుని  స్వగ్రామం పులివెందులలో ఉన్న  మిషనరీ ఆసుపత్రిలో వైద్యులుగా చేరి ఆ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సహాయం అందిస్తూ  ఆ పేద ప్రజలందరి దృష్టిలో దేవుడయ్యాడు.
రాజశేఖర్ రెడ్డిలోని సేవకు  పదిమందికి సహాయ పడాలన్న ఎంత పనులను అర్థం చేసుకున్న  తండ్రి వైయస్ రాజారెడ్డి  తన కుమారులు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించగలరు  అన్న ఉద్దేశంతో  రాజకీయాలలోకి వెళ్ళమని ప్రోత్సహించారు కొడుకుని  తండ్రి గారి ఆదేశాల ప్రకారం భార్య విజయలక్ష్మి గారి సహకారంతో ఆ నాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న  జలగం వెంగళరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు  రాజశేఖర్ రెడ్డి గారు 1978లో పులివెందుల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఆయనే వలనే ఇందిరా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి వచ్చింది  ముఖ్యమంత్రి సలహా మేరకు అప్పుడు గెలిచిన కాంగ్రెస్ వారంతా ఇందిరా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాను శాసనసభ్యుడుగా ఉన్న సమయంలో తన నియోజకవర్గ సమస్యలు జిల్లాలో పేదలు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులు  మరెన్నో సమస్యలను రాష్ట్ర శాసనసభలో చర్చకు తెచ్చారు  తోటి శాసనసభ్యులతో సఖ్యతగా ఉంటూ వారి నియోజకవర్గ సమస్యలను అర్థం చేసుకుంటూ వారి సమస్యలను కూడా శాసనసభలో ప్రస్తావించేవారు  ఆనాడు సభలో సభ్యుడుగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్న గారు, చనిమోలు వెంకట్రావు గారు, మండల వెంకట కృష్ణారావు గారు, పిన్నమనేని కోటేశ్వరరావు గారు,  చేబ్రోలు హనుమయ్య గారి లాంటి పెద్దల సలహాలను తీసుకుంటూ  సభలో అన్ని పార్టీల సభ్యుల గౌరవ మర్యాదలను పొందారు.

కామెంట్‌లు