ఆడపిల్లల్ని కాపాడుకోవాలి; -సి.హెచ్.ప్రతాప్

 బాలికలు ఆరోగ్యంగా పెరిగినట్లయితే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారు. చిన్న వయసులో జరిగే వివాహాలు, గర్భ ధారణ వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అమ్మాయికి 18 ఏండ్ల వరకు పెండ్లి చేయకుండా అంటే బాల్య వివాహాలు జరగకుండా చూడటం కూడా సమాజ బాధ్యత. ఇందుకోసం ప్రభుత్వం తో పాటు, స్వచంద సంస్థలు, ఉపాధ్యాయులు, మేధావులు ఇతోధికంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. సమాజంలో నెలకొని ఉన్న కట్నాలు వంటి దురాచారాల వలన తల్లీదండ్రులు ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వడ్లగింజ గొంతులో వేసి చంపేయడం, ఏ ముళ్ళ పొదల్లోనో పారేయడం వంటి అమానవత్వ సంఘటనలకు నేటికీ పాల్పడుతున్నారు. ఇంకా వైద్య శాస్త్రంలోని టెక్నాలజీనీ వాడుకొని కడుపులో ఉన్న బిడ్డ అడా మగా అని తెలుసుకొని అడబిడ్డల్ని చంపేసే వారు ఎందరో ఉన్నారు. ఫలితంగా జీవ సమతుల్యతలో ఆడపిల్లలు తగ్గిపోయి కేవలం మగ పిల్లలు మాత్రమే ఉంటే సమాజంలో సమతుల్యత లోపిస్తుంది.. ఆడపిల్లల పెంపకలు భారం కావటం వల్లనే తల్లిదండ్రులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. కట్న సమస్య, పెళ్ళయ్యాక ఆడపిల్లలపై అత్తింట్లో వేధింపులు  వంటివి లేకపోతే తల్లిదండ్రులు ఆనందంగా ఆడపిల్లల్ని పెంచుతారు అనేది సత్యం.
అమ్మాయిలకు చదువుకునే అవకాశం కల్పిస్తే బాల్య వివాహాల శాతం తగ్గుతుంది. కుటుంబంలో కూడా బాలికలు శ్రమ దోపిడీకి గురౌతున్నారు. మగపిల్లలతో పాటు సమానమైన చదువులు, జీతాలు రెండూ లేవు. విద్య, వైద్య సంరక్షణ, రక్షణ, చట్టపరమైన హక్కులు, గృహసింస, బలవంతపు బాల్య వివాహాలు వంటి ఎన్నో రకాల అసమానతలను బాలికలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో సరియైన మరుగుదొడ్లు లేక మధ్యలోనే చదువుకు మానేస్తున్నారు. రుతుస్రావ సమయాల్లో ఎలాంటి పరిశుభ్రత పాటించాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నారు.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం