త్రిపుర సుందరి అష్టకం ;- కొప్పరపు తాయారు
 🌟శంకరాచార్య విరచిత🌟
శ్లోకం: 
సకుంకుమ విలేపనా మలక చుంబి కస్తూరి కాం
సమందహాసి తేక్షణాం సశరచాప పాశాంకుశామ్ !
అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురాం జపవిదౌ స్మరామ్యంబికా

మ్ !
భావం:
 కుంకుమ కలిసిన విలేపనము పూసుకు న్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరి తిలకమును 
ధరించినదీ,చిరునవ్వులతో కలిసిన కన్నులు కలదీ
పుష్ప బాణమును_చెఱకు వింటినీ_పాశాంకుశములను_ధరించినదీ.అశేష జనులను మోహింపచేయునదీ, ఎఱ్ఱని 
పూలదండలను_ఆభరణములను_వస్త్రములను_ధరించినదీ_జపాపుష్పమువలె ప్రకాశించు చున్నదీ  అగు జగదంబను జపము చేయు నెపుడు స్మరించెదను.
                       ****

కామెంట్‌లు