భాగ్యనగరం రవీంద్రభారతి లో లోకకవి అందెశ్రీ కి 108 కవులతో కవిత్వ నివాళి

  జాతీయ తెలుగు సారస్వత పరిషత్      తెలంగాణ విభాగం, లక్ష్య సాధన ఫౌండేషన్, తెలుగు భాషా చైతన్య సమితి, కుసుమ ధర్మన్న కళాపీఠం మరియు పాలడుగు నాగయ్య కళా పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల శ్రీరామచంద్రుని దరి చేరిన  తెలంగాణ రాష్ట్రగీత రచయిత లోకకవి డాక్టర్ అందెశ్రీ  గారి సంస్మరణ సభలో 108 కవులచే కవిత్వ నివాళి లో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య  అయ్యలసోమయాజుల ప్రసాద్  విశాఖపట్నం పాల్గొని " ప్రజాకవి అందెశ్రీకి  నా అక్షర నివాళి" అని కవితాగానం చేసిన సందర్భంగా తెలంగాణ జానపద కవి గేయ రచయిత అందెశ్రీ సన్నిహితులు జయరాజ్ ,కవియత్రులు డాక్టర్ రాధకుసుమ, పాలడుగు సరోజనీదేవి, సాహితీ వేత్తలు రామకృష్ణ చంద్రమౌళి, గంటా మనోహర్ రెడ్డి , గజవెళ్ళి సత్యనారాయణ ,బడేసాబ్ సమక్షంలో మహనీయులు అందెశ్రీ జ్ఞాపకార్ధం  జ్ఞాపికను అందచేసారు సభకు ముఖ్య అతిధిలుగా తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్  కవి రచయిత డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి,ప్రజ్ఞారాజు,జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేశిరాజు రామ ప్రసాద్ పాల్గొన్నారు.
..........................
కామెంట్‌లు