ధరణిని వీడిన భరణి కి నా అక్షర నివాళి:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్( పుష్యమి)- విశాఖపట్నం.
చిన్ననాటి నేస్తమా
ఇంతితై వటుడింతై అన్నట్లు
అనకాపల్లి నుంచి ఆకాశమంత ఎత్తకు ఎదిగి
సత్యారావు మాస్టారు బోధనలలో
సనాతనమే వసుదైకానికి ఆదర్శమని
సంస్కృతి సంప్రదాయాలను వదలక
అప్పటినుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నావు ప్రసాదు అని
భారతీయ విద్యాకేంద్రం లో 
ఆదర్శ అధ్యాపకునిగా పని చేసావు ప్రసాదు అని
గౌతమబుద్ధుడు మనం మాస్టారుతో కలసి అర్ ఎస్ ఎస్ పిక్నిక్ విషయాలు జ్ఞాపకం చేసావు
సినీ గేయమాంత్రికుడిగా సినీ వినీలాకాశంలో ఎదిగి
జగమంత కుటుంబం నాది అని
ఆది భిక్షువు వాడి నేమి అడిగేదని
నిగ్గు దీసి అడుగు ఈ సిగ్గలేని సమాజం అని
అపురూపమైనదమ్మ ఆడజన్మ అని
ఎన్నో ఎన్నెన్నో సినీగీతాలు రచించి
గాన గంధర్వుడు ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం చే సీతారాముడు అని పిలిపించుకుని
కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు నా రెండు భుజాలు పోయాయని 
నీవు బాలు మరణించినపుడు ఆర్థ్రతతో కన్నీరు పెట్టడం
అత్యున్నత పద్మశ్రీ అవార్డును. స్వీకరించిన పుడు
ఇంకా మంచి పురస్కారాలు వస్తాయని అంటే
అంతా శివుని కృప అన్న నీవు
ఆ పరమేశ్వరుని చెంత చేరి నాలుగు  సంవత్సరాలు 
గౌతమ బుద్ధుడు లేడు నీవు కనుమరుగయ్యావు
అనకాపల్లి ఉన్నత పాఠశాల జ్ఞాపకాలు  గుర్తుచేసుకుంటు
ఏదైనా. జాతస్యహి  ధ్రువో.మృత్యు:  అని తెలిసినా
నీ జ్ఞాపకాలను మరువలేకున్నా నేస్తమా..!!


 ( నవంబర్ 30. చిన్ననాటి స్నేహితుడు సిరి వెన్నెల సీతారామ శాస్త్రి వర్ధంతి)
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘ 

కామెంట్‌లు