ఓడరేవు:- - యామిజాల జగదీశ్
 1905లో చెన్నై ఓడరేవుకు బ్రిటిష్ సైనికులు చేరుకున్న దృశ్యం!
అప్పట్లో వారు అనేక పడవలలో వచ్చి చెన్నై ఓడరేవుకు చేరుకుని నగరంలోకి అడుగుపెట్టే వారు. ఇదికూడా మామూలుగా కాదు, 
ఓడరేవు చేరుకున్న బ్రిటీషర్లను క్రేన్లతో నింపి చెన్నై నేలలోకి దింపేవారు. ఇది అరుదైన చారిత్రక సంఘటన!
1905లో జరిగిన ఈ సంఘటనను అక్కడ ఉన్న బ్రిటిష్ అధికారులు చూస్తుండగా తీసిన ఫోటో ఇది. అప్పట్లో ఈ ఓడరేవును షిప్‌యార్డ్ ప్లాట్‌ఫారమ్ అని పిలిచే వారు.
ఓడరేవు వద్ద పని చేస్తున్న చెన్నై నుండి వచ్చిన ఉద్యోగులు, బ్రిటిష్ సైనికులు వచ్చిన ఓడకు కొంచెం దూరంగా నిలబడి స్వాగతం పలికారు. 
ఇక్కడికి నేను వెళ్ళింది ఒకే ఒక్కసారి.‌ అదికూడా బయట నుంచి చూడటమే.
దాదాపు పదమూడేళ్ళ తర్వాత మద్రాసు కి వెళ్ళటం. చెన్నై బీచ్ స్టేషన్లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆగడంతోనే బయటకు వచ్చాం.‌ దానిని మొదట్లో బీచ్ రోడ్ అని పిలిచే వారు. తర్వాతి రోజుల్లో దానిని రాజాజీ శాలైగా పేరు మార్చారు.‌ మన దేశపు చివరి గవర్నర్ జనరల్ ఈయన.‌ రాజాజీ టీ.నగర్లోని బంతుల్లా రోడ్డులో నివసించేవారు. వారి ఎదురింట్లోనే నేను పుట్టి పెరిగింది. మేముండిన ఇంటి నెంబర్ 14, బజుల్లా రోడ్డు.
ఈ వీధిలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఉంది. దీనికి ఆపోజిట్ లోనే బర్మాబజార్ ఉంది‌. ఇదీ చాలా పురాతన బజారు.‌  
ఎంత ఆనందంగా ఉందో చాలా సంవత్సరాల తర్వాత రావడం వల్లనేమో.‌ 

కామెంట్‌లు