సాహితీ కెరటాలుసాహితీ కవి కళా పీఠం=================జీవితమనే పుస్తకమున,ఊహించని మలుపులతో సాగేబ్రతుకు కథలో, ఆఖరి పేజీ ఇచ్చేముగింపు సుఖాంతమో, దుఃఖాంతమో,తెలియదుగా ముందే ఎవరికీ!అది విధి లిఖితమని భావించి,అనుసరిస్తూ పోవుట కన్నా,చెమట చుక్కలు చిందించినుదుటి రాత మార్చగా,నిర్విరామ కృషి చేసి,అందంగా మలచాలిగా!ఎప్పుడే పుట తిరగేసినా,మధుర పరిమళమే తాకేలా,నడవాలి మనం ప్రతిక్షణం,మలచుకోవాలి అందంగా జీవనం.ఉన్నదానితో తృప్తినొంది,లేనిదానికై నిజాయితీతో కష్టపడి,మూడునాళ్ళ ఈ బ్రతుకునుముచ్చటగా తీర్చుకోక;ముళ్ళకంపలా మార్చుటేల, మహిలో?
అందంగా మలచాలిగా:- బి.ఉషారాణి-మంచిర్యాల
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి