సాహితీ కవి కళాపీఠం,సాహితీ కెరటాలు,============జీవితం ఓ తెల్లరంగు కాగితం.!చిరుగాలికి నేస్తమై సంచరిస్తున్న నాపై,అక్షర మాలికల పేరుతో మధుర కవిత్వమై నన్నుపులకరింప జేస్తోంది.!ఎక్కడో రాజరికపు కోటల్లో పుట్టి, ఇక్కడ గుండె లోతుల్ని తట్టింది కవితేగా మరి.!శ్రమతో కూడిన ప్రాస కనబరుస్తూ, పవిత్ర ప్రేమతో కూడిన ఆశ వెలువడుతోంది.!సరళ సాహిత్య మాధురీ ఈ కావ్యాంజలి,సిరుల మహత్య కానుకగా ఈ భాష్యాంజలి,రంగ రంగ వైభవం కనిపిస్తుంది ప్రతీ అక్షరం లో !తరంగ మృదంగ స్వభావం తాండవిస్తూ,ప్రతి పద పక్షంలో సర్వాంగ సుందరమైన కావ్య మనోహరం, నేటి కవితా ప్రపంచానికి ఓ నవ్య అలంకారమే.!అల్లికల జిగిబిగితో, ముద్దు పలుకులతో,అనన్య కల్పనా చాతుర్యముతో, మధుర భక్తి ఆవేశముతో ప్రభంధాలను రచిస్తోంది.!ఏదో తెలియని బంధంతో, ప్రతీ క్షణం సుందరమై,స్నేహ భరితమై మనసు ఆనంద మయమౌతోంది.!చాలు కదా ఈ సామాన్య జీవితానికి అసమాన్య అగ్ర తాంబూలం.!
మధుర కవిత్వం :- ఓగిరాల గాయత్రి విజయవాడ
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి