అమరులు!!: - డా ప్రతాప్ కౌటిళ్యా
అతడు 
పవిత్రమైన పాలు 
ఎన్ని నీళ్లు కలిపిన 
పాలు గానే మిగిలిపోతాడు.!?

అతడు తాగినవి 
అమ్మే పాలు కాదు 
అమ్మ పాలు...

అతని పాలన అమ్మ పాలన 
అతని దీవెన వెలిగే దివ్వే.!?

అతడు 
ప్రకృతి తేనె లాంటివాడు 
ఎంత చక్కెర కలిపిన 
తీయ్యనీ తేనె గానే మిగిలిపోతాడు.!?

అతడు తిన్నది 
అమ్మే చక్కెర కాదు 
ప్రకృతి అమ్మ తయారుచేసిన 
తేనె.!!

అతను ప్రపంచానికి పంచిన 
మంచి 
పంచామృతం!!

అది పంచినా అతను 
అది తాగిన ప్రజలు-అమరులు.!!

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణానికి స్పందిస్తూ. 

డా ప్రతాప్ కౌటిళ్యా 
శ్రీశ్రీ కళావేదిక జిల్లా సమన్వయకర్త.

కామెంట్‌లు