పరీక్షిత్తు మహారాజు
శ్రీమద్భాగవత ప్రధమ స్కందంలో పరీక్షిత్తు మహారాజు వృత్తాంతం అత్యంత ప్రాధాన్యత కలిగినది. కురుపాండవ సంగ్రామం అనంతరం పాండవుల వంశానికి ఏకైక వారసుడిగా మిగిలిన పరీక్షిత్తు, గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ప్రయోగించిన భీకరమైన బ్రహ్మశిరోనామక అస్త్రం నుండి శ్రీకృష్ణుడి చక్రాయుధం ద్వారా రక్షించబడ్డాడు. పాండవులు మహాప్రస్థానానికి వెళ్లే సమయంలో హస్తినాపుర సామ్రాజ్య బాధ్యతలను పరీక్షిత్తుకు అప్పగించారు. ధర్మరాజు చూపిన ధర్మమార్గంలో నడుస్తూ పరీక్షిత్తు అనేక అశ్వమేధ యాగాలను నిర్వహించి, ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించాడు. ఒకానొక సందర్భంలో దిగ్విజయ యాత్రకు వెళ్లిన పరీక్షిత్తుకు కలిపురుషుడు ఒక ఆవును, ఎద్దును హింసిస్తూ కనిపించాడు. ధర్మ దేవత స్వరూపమైన ఆ ఎద్దు మూడు కాళ్లు కోల్పోయి ఉండటం చూసి, పరీక్షిత్తు కలిని శిక్షించడానికి సిద్ధమయ్యాడు. కలి శరణు కోరగా, పరీక్షిత్తు కరుణించి అతనికి జూదం, మద్యం, స్త్రీ వ్యామోహం, హింస వంటి అధర్మ స్థావరాలలో నివసించే అనుమతిని ఇచ్చాడు. బంగారం ఉన్న చోట కూడా కలికి నివాసం కల్పించడం వల్ల కలిపురుషుడు రాజు కిరీటంలో ప్రవేశించే అవకాశం లభించింది.
మహారాజు ఒకనాడు వేట కోసం అడవికి వెళ్లినప్పుడు తీవ్రమైన దప్పికకు, ఆకలికి గురయ్యాడు. నీటి కోసం వెతుకుతూ శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మహర్షి గాఢమైన ధ్యానంలో ఉండటం వల్ల రాజు రాకను గమనించలేదు. కలి ప్రభావంతో బుద్ధి చలించిన పరీక్షిత్తు, మహర్షి తనను కావాలనే ఉపేక్షించాడని భావించి, ఆగ్రహంతో అక్కడే పడి ఉన్న ఒక మృత సర్పమును తీసి మహర్షి మెడలో వేశాడు. ఈ విషయం తెలిసిన శమీక మహర్షి కుమారుడైన శృంగి, తన తండ్రిని అవమానించిన వ్యక్తికి ఏడు రోజులలో తక్షకుడనే సర్పం కాటు వల్ల మరణం సంభవిస్తుందని శాపం ఇచ్చాడు.
ఈ శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్తు మహారాజు ఏమాత్రం కలత చెందకుండా, తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడు. దీనిని ఒక దైవిక అవకాశంగా భావించి వైరాగ్యం పొందాడు. తక్షణమే రాజ్య భోగాలను, బంధాలను త్యాగం చేసి, గంగానది తీరానికి చేరుకుని ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. మరణానికి సిద్ధంగా ఉన్న పరీక్షిత్తుకు అభయం ఇవ్వడానికి అనేక మంది మహర్షులు, సిద్ధులు అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో పరమహంస స్వరూపుడైన శుఖమహర్షి అక్కడకు విచ్చేశాడు. మరణించబోయే వ్యక్తి చేయవలసిన ఉత్తమ కార్యం ఏమిటని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుఖదేవుడు శ్రీమద్భాగవతాన్ని బోధించడం ప్రారంభించాడు.
పరీక్షిత్తు మహారాజుకు ఏడు రోజుల పాటు జరిగిన ఈ భాగవత శ్రవణం మానవాళికి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఐహిక సంపదలు, అధికారాలు ఏవీ శాశ్వతం కావని, మరణం అనివార్యమని తెలిసినప్పుడు కేవలం భగవంతుని నామస్మరణే శరణ్యమని ఈ ఘట్టం నిరూపిస్తుంది. ఒక చక్రవర్తి తన పొరపాటును అంగీకరించి, శాపాన్ని సైతం వరంగా మార్చుకుని పరమపదాన్ని పొందిన తీరు అద్భుతమైనది. భక్తి మార్గంలో పయనించే ప్రతి ఒక్కరికీ పరీక్షిత్తు జీవితం ఒక గొప్ప పాఠంగా నిలుస్తుంది. భాగవత పురాణ ఆవిర్భావానికి, దాని వ్యాప్తికి పరీక్షిత్తు జిజ్ఞాస ప్రధాన కారణమైంది. ఈ విధంగా పరీక్షిత్తు మహారాజు కేవలం ఒక పాలకుడిగానే కాకుండా, ఉత్తమ భక్తుడిగా లోకానికి ఆదర్శప్రాయుడయ్యాడు.
శ్రీమద్భాగవత ప్రధమ స్కందంలో పరీక్షిత్తు మహారాజు వృత్తాంతం అత్యంత ప్రాధాన్యత కలిగినది. కురుపాండవ సంగ్రామం అనంతరం పాండవుల వంశానికి ఏకైక వారసుడిగా మిగిలిన పరీక్షిత్తు, గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ప్రయోగించిన భీకరమైన బ్రహ్మశిరోనామక అస్త్రం నుండి శ్రీకృష్ణుడి చక్రాయుధం ద్వారా రక్షించబడ్డాడు. పాండవులు మహాప్రస్థానానికి వెళ్లే సమయంలో హస్తినాపుర సామ్రాజ్య బాధ్యతలను పరీక్షిత్తుకు అప్పగించారు. ధర్మరాజు చూపిన ధర్మమార్గంలో నడుస్తూ పరీక్షిత్తు అనేక అశ్వమేధ యాగాలను నిర్వహించి, ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించాడు. ఒకానొక సందర్భంలో దిగ్విజయ యాత్రకు వెళ్లిన పరీక్షిత్తుకు కలిపురుషుడు ఒక ఆవును, ఎద్దును హింసిస్తూ కనిపించాడు. ధర్మ దేవత స్వరూపమైన ఆ ఎద్దు మూడు కాళ్లు కోల్పోయి ఉండటం చూసి, పరీక్షిత్తు కలిని శిక్షించడానికి సిద్ధమయ్యాడు. కలి శరణు కోరగా, పరీక్షిత్తు కరుణించి అతనికి జూదం, మద్యం, స్త్రీ వ్యామోహం, హింస వంటి అధర్మ స్థావరాలలో నివసించే అనుమతిని ఇచ్చాడు. బంగారం ఉన్న చోట కూడా కలికి నివాసం కల్పించడం వల్ల కలిపురుషుడు రాజు కిరీటంలో ప్రవేశించే అవకాశం లభించింది.
మహారాజు ఒకనాడు వేట కోసం అడవికి వెళ్లినప్పుడు తీవ్రమైన దప్పికకు, ఆకలికి గురయ్యాడు. నీటి కోసం వెతుకుతూ శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మహర్షి గాఢమైన ధ్యానంలో ఉండటం వల్ల రాజు రాకను గమనించలేదు. కలి ప్రభావంతో బుద్ధి చలించిన పరీక్షిత్తు, మహర్షి తనను కావాలనే ఉపేక్షించాడని భావించి, ఆగ్రహంతో అక్కడే పడి ఉన్న ఒక మృత సర్పమును తీసి మహర్షి మెడలో వేశాడు. ఈ విషయం తెలిసిన శమీక మహర్షి కుమారుడైన శృంగి, తన తండ్రిని అవమానించిన వ్యక్తికి ఏడు రోజులలో తక్షకుడనే సర్పం కాటు వల్ల మరణం సంభవిస్తుందని శాపం ఇచ్చాడు.
ఈ శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్తు మహారాజు ఏమాత్రం కలత చెందకుండా, తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడు. దీనిని ఒక దైవిక అవకాశంగా భావించి వైరాగ్యం పొందాడు. తక్షణమే రాజ్య భోగాలను, బంధాలను త్యాగం చేసి, గంగానది తీరానికి చేరుకుని ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. మరణానికి సిద్ధంగా ఉన్న పరీక్షిత్తుకు అభయం ఇవ్వడానికి అనేక మంది మహర్షులు, సిద్ధులు అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో పరమహంస స్వరూపుడైన శుఖమహర్షి అక్కడకు విచ్చేశాడు. మరణించబోయే వ్యక్తి చేయవలసిన ఉత్తమ కార్యం ఏమిటని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుఖదేవుడు శ్రీమద్భాగవతాన్ని బోధించడం ప్రారంభించాడు.
పరీక్షిత్తు మహారాజుకు ఏడు రోజుల పాటు జరిగిన ఈ భాగవత శ్రవణం మానవాళికి మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఐహిక సంపదలు, అధికారాలు ఏవీ శాశ్వతం కావని, మరణం అనివార్యమని తెలిసినప్పుడు కేవలం భగవంతుని నామస్మరణే శరణ్యమని ఈ ఘట్టం నిరూపిస్తుంది. ఒక చక్రవర్తి తన పొరపాటును అంగీకరించి, శాపాన్ని సైతం వరంగా మార్చుకుని పరమపదాన్ని పొందిన తీరు అద్భుతమైనది. భక్తి మార్గంలో పయనించే ప్రతి ఒక్కరికీ పరీక్షిత్తు జీవితం ఒక గొప్ప పాఠంగా నిలుస్తుంది. భాగవత పురాణ ఆవిర్భావానికి, దాని వ్యాప్తికి పరీక్షిత్తు జిజ్ఞాస ప్రధాన కారణమైంది. ఈ విధంగా పరీక్షిత్తు మహారాజు కేవలం ఒక పాలకుడిగానే కాకుండా, ఉత్తమ భక్తుడిగా లోకానికి ఆదర్శప్రాయుడయ్యాడు.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి