బాలల మాసపత్రిక ‘మొలక’ ఫిబ్రవరి సంచిక ఆవిష్కరణ

విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు
 బాలల మాసపత్రిక ‘మొలక’ ఫిబ్రవరి సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిల్లల పక్షాన మాతృభాష కోసం కృషి చేస్తున్న ‘మొలక’ ను అభినందించారు.చిన్నారుల కోసం ఇలాంటి విలువైన పత్రికలను నడుపుతున్నందుకు అందరూ ఆదరించాలని కోరారు. పిల్లలు బాల్య దశలోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధించాలంటే కథలు, కవితలు, సామెతలు వంటి శీర్షికలతో కూడిన రచనలను చదవడం అలవాటు  చేసుకోవాలని సూచించారు.మొలక ఎడిటర్ వేదింత సూరి  చేస్తున కృషి అభినందనీయం  అన్నారు.ఈ కార్యక్రమంలో ‘మొలక’ ప్రత్యేక ప్రతినిధి KVM వెంకట్, ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యత మడిపల్లి దక్షిణామూర్తి పాల్గొన్నారు.
కామెంట్‌లు