శివకేశవులకు అభేదమా ?: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే !
శివస్య హృదయం విష్ణు: విష్ణోస్య హృదయం శివః!.
అని సంధ్యావందనాది
అనేక నిత్యకర్మలలో
స్థితి లయకారకుల మధ్య
అభేదం లేదని అనేక మహనీయులు,  మంత్ర ద్రష్టలు 
అనాదిగా చెబుతున్నారు
జీవన్ముక్తి నిచ్చే విష్ణు సహస్ర నామస్తోత్రంలో కూడా
ఈశ్వర ఉవాచ అని పార్వతీమాతకు
మోక్షప్రదానమయిన
తారకమంత్రం
'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే' అని చెప్పారు.
విపత్కర పరిస్థితులలో ధర్మ పరిరక్షణ కొరకై
సాక్షాత్తు పరమేశ్వర ప్రతిరూపమైన
ఆది శంకరాచార్య
అద్వైత వేదాంతాన్ని పునరిద్ధించి
'బ్రహ్మ సత్యం, జగన్మిమిధ్య బ్రహ్మైవ నా పరః 'అని
దేశంలో నాలుగు ధర్మ పీఠాలను స్థాపించి
సౌందర్యలహరి
వివేకా చూడామణి,శివానందలహరి ,బ్రహ్మసూత్రాలకు ఉపనిషత్తులు
భగవద్గీతకు వ్యాఖ్యానాలను వ్రాసి
నాస్తికత్వాన్ని రూపుమాపి షణ్మత స్థాపన చేసి
 శివ, విష్ణు, శక్తి, గణపతి, సూర్య ,కుమారస్వామి
 ఆరాధనను క్రమబద్ధీకరణ చేసిన మహాత్ములు
నేడు మతమార్పిడులు జరుగుతున్న సమయంలో
సనాతన ధర్మమే వసుదైకానికి ఆదర్శమని 
ధర్మపరిరక్షణ చేస్తున్న పీఠాధిపతులు,స్వాములు
శివకేశవుల మధ్య భేదం చూపుట
సమంజసమా?
విజ్ఞులు,ప్రాజ్ఞులు ఆలోచించండి
'ధర్మో రక్షతి రక్షితః' అన్నది పాటించి
సమాజ కల్యాణానికి పూనుకుందాం...!!

లోకా సమస్తా సుఖినో భవంతు.
............................


కామెంట్‌లు