జాతీయ కవితల విజేత కుప్పిలి వెంకట రాజారావు
  విశాఖపట్నం సహృదయ సాహితి సమితి జాతీయస్థాయిలో నిర్వహించిన కవితల పోటీల్లో స్థానిక రచయిత కుప్పిలి వెంకట రాజారావు విజేతగా నిలిచారు. విశాఖపట్నంపౌర గ్రంథాలయంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ వేదికపై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బేతవోలు రామబ్రహ్మం చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఎండుటాకు అనే కవిత పంపిన వెంకట రాజారావును అభినందిస్తూ న్యాయనిర్ణేతల బృంద సభ్యులతో పాటు సహృదయ సాహితి అధ్యక్షులు శేఖరమంత్రి ప్రభాకర్, కార్యదర్శి చినసూర్యనారాయణ తదితరులు 

శాలువా, జ్ఞాపిక, విజేతప్రశంసాపత్రం, నగదు పారితోషికాలతో ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Heartily proud of u sir. Iam your student in zphs school kotabommali.