అక్షరయోధునికి నా అక్షరాభినందనలు : - కవిమిత్ర ,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-హైదరాబాద్.
సమాజశ్రేయస్సే  జీవితలక్ష్యమని
అక్షరమే ఆయుధంగా  చేతబూని
తనదైన శైలిలో  ప్రజలకు ప్రేరణనిచ్చి
జన్మకు కారణమైన తండ్రి  రజాకార్లకు వ్యతిరేకంగా
విప్లవభావాలతో పోరాడిన ప్రభావంతో
ప్రజాహితమే తనహితమని
విద్యార్థి దశలోనే కవిత్వం కథలతో జరిగే అన్యాయాలను తెలిపి
మంజీరా రచయితల సంఘంను ఏర్పరచి
ఏడు కవితా సంకలనాలను  వెలువరించిన
డాక్టర్ నందిని సిద్దారెడ్డి  గారు సమాజకవి.

తెలంగాణ ఉద్యమ పోరాటంలో
ఒకే గంట వ్యవధిలో రచించిన
నాగేటి చాల్లల్ల కవిత సంపుటి ద్వారా
సంస్కృతి సంప్రదాయాలను వివరించిన ఘనాపాఠి
భూమి స్వప్నం కవితకు దాశరథి పురస్కారం
ప్రాణహిత కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
నాగేటి సాలల్లో  నా తెలంగాణ పాటకు ఉత్తమగేయ రచయితగా నందిపురస్కారం
తెలంగాణ  సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా
మీరు చేసిన సాహితీ కృషి
'నభూతో నభవిష్యతి'
కరోనా సమయంలో సమాజ పరిస్థితిపై మీరు వ్రాసిన
'అనిమేష' కవితాసంపుటికి   కేంద్ర సాహిత్య అకాడమీ  పురస్కారం రావడం తెలుగు వారికే గర్వకారణం.

ఎవరేమనుకున్నా  
చిటికెన వేలులా  జీవించలేను
హృదయం మార్చుకుని ఉత్సవ విగ్రహం నుందు ఉరేగలేను
అని నిజాన్ని నిర్భయంగా వ్యక్తీకరించే
అక్షర సూర్యుడు
ఆచార్యునిగా ఎందరినో తీర్చిదిద్దిన ఉత్తమ అధ్యాపకులు .  
ఆప్యాయంగా సాహితీ సభలలో పలుకరించే
సరస్వతీ మానస పుత్రులు
డాక్టర్ నందిని సిద్దారెడ్డి గారు
మీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికే వన్నె తెచ్చిన సందర్భంగా
అందుకోండి
మీకివే నే సమర్పిస్తున్న    
 అక్షరాంజలులు..!!
..........................


కామెంట్‌లు