రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారగ్రహీత గద్వాల సోమన్నకు సన్మానం

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త,బహు గ్రంథ కర్త,బాలబంధు గద్వాల సోమన్నను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం -2026 ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడలో అందుకోవడం విదితమే.ఈ సందర్బంగా తాను పని చేస్తున్న నాగలదిన్నె జడ్పీ హైస్కూల్  ప్రధానోపాధ్యాయులు శ్రీ అద్దేపల్లి జాన్సన్, తోటి ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ఆయనను ఘనంగా సన్మానించారు.రాష్ట్ర స్థాయి అవార్డు రావడం పాఠశాలకు గర్వకారణం అన్నారు.గణితోపాధ్యాయుడు,కవి గద్వాల సోమన్న  అవిరల కృషిని ప్రశంసించారు. అదే విధంగా పలు ప్రాంతాల వారు పురస్కార గ్రహీత గద్వాల సోమన్న సత్కరించి, తమ అభిమానం చాటుకోవడం విశేషం.
కామెంట్‌లు